ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వస్తుండగా ఢీకొట్టిన కారు - దంపతులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 3:47 PM IST

road_accident_in_eluru_two_persons_dead

Road Accident In Eluru Two Persons Dead: ఏలూరు జిల్లా దెందులూరు మండలం సింగవరం పరిధిలో 216వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ఢీకొని భార్యాభర్తలు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఏలూరు నుంచి గుండుగొలను వస్తున్న కారు బెయిలీ వంతెన వద్ద మహేశ్, జగన్​ను ఢీకొని అనంతరం తాడేపల్లిగూడెం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోరు దుర్గారావు (46)మృతి చెందగా.. ఈశ్వరమ్మ, మహేశ్, మోహన్​కు తీవ్ర గాయాలయ్యాయి. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈశ్వరమ్మను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. గాయపడిన వారిని చికిత్స కోసం వేరు వేరు ఆసుపత్రులకు తరలించారు. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో మృతి చెందిన దుర్గారావు దంపతుల స్వగ్రామం తోకలపల్లి కాగా.. భూమి రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details