ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Clashes Between YCP Leaders: రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. రోడ్డుపైనే ఫైటింగ్​

By

Published : May 12, 2023, 10:55 PM IST

Clash

Clash Between YCP Leaders:ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నాయకులు ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలో వారి అనుచరులు ఎదురెదురు పడటంతో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. ఇంతకీ ఆ ఒకే పార్టీ నాయకులు ఎవరంటే.. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అదే పార్టీ వ్యక్తి శేఖర్ రెడ్డిలు.

వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కోడూరులో బుధవారం రాత్రి వైసీపీ నాయకుల మధ్య జరిగిన గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోడూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితోపాటు అనుచరులు హాజరయ్యారు. అదే సమయంలో వైసీపీలో రెబల్​గా వ్యవహరిస్తున్న గంగవరం శేఖర్ రెడ్డి కూడా వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇరువురు తారసపడడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. గంగవరం శేఖర్ రెడ్డి అనుచరులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు వెంటపడి చితక బాదారు. అయితే గంగవరం శేఖర్ రెడ్డి ఇంతవరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం విశేషం. 

ABOUT THE AUTHOR

...view details