YSRCP MPs Did Not Talk About AP Development In Parliament :లోక్సభ సీట్ల పరంగా దేశంలోనే ఐదో అతిపెద్ద పార్టీగా అవతరించినా రాష్ట్ర ప్రయోజనాలను కాపడటంలో వైఎస్సార్సీపీ ఎంపీలు (YSRCP MPs) పార్లమెంట్ లోపల కానీ, బయట కానీ కేంద్రాన్ని నిలదీయడం దేవుడెరుగు.. కనీసం ప్రశ్నించిన పాపాన పోలేదు. NDA మిత్రపక్షాల కన్నా ముందుగానే కేంద్రం పెట్టే బిల్లులన్నింటికీ బేషరతుగా మద్దతివ్వడం.. బీజేపీ ఎంపీ (BJP MP)ల కన్నా ఎక్కువగా ప్రతిపక్షాలపై విరుచుకుపడటం వైఎస్సార్సీపీ ఎంపీలకు అలవాటైపోయింది. విభజన హామీల (Bifurcation Assurances) సాధనపై ఏమాత్రం చొరవ చూపడం లేదు.
MP Vijaya Sai Reddy Silent in Andhra Pradesh Development :వైఎస్సార్సీపీ ఎంపీలు విశాఖ రైల్వేజోన్ (Visakha Railway Zone), మెట్రో ప్రాజెక్ట్ (Metro Project) పనులపై కేంద్రాన్ని ఒప్పించలేకపోయారు. కీలక ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) ఏనాడూ తన పరపతిని రైల్వేజోన్ సాధన కోసం వినియోగించలేకపోయారు. పైగా విశాఖ ఉక్కు కర్మాగారం (Visakha Steel Plant) అమ్మకానికి పెట్టినా నోరు మెదపడం లేదు. కనీసం కార్మికులకు వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దతు కూడా తెలపలేదు. ఈ నాలుగేళ్లలో విశాఖ మెట్రో ఒక్కటంటే ఒక్క అడుగూ ముందుకు పడలేదు. గత ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్ను మార్చి కొత్తది చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం వద్దే మూలుగుతోంది.
రైల్వే జోన్ సాధించలేని వైసీపీ ఎంపీలు : రాజధాని అమరావతి మీదుగా పెర్రుపాలెం-అమరావతి-నంబూరు డబుల్ లైన్, అమరావతి-పెదకూరపాడు, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య కొత్తగా సింగిల్ లైను కలిపి 106 కి.మీ. మేర నిర్మాణానికి 2,679 కోట్లతో DPR పూర్తయినా ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ సాధించలేకపోయారు. కడప-బెంగళూరు మధ్య 268 కి.మీ. ప్రాజెక్టు 2,849 కోట్లతో చేపట్టినా పనులు సాగడం లేదు. నడికుడి-శ్రీకాళహస్తి మధ్య 2,700 కోట్లతో 309 కి.మీ. లైన్దీ అదే గతి. 2,125 కోట్లతో 57 కి.మీ. మేర ప్రతిపాదించిన కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ పనులకూ దిక్కులేదు. రాయదుర్గం-తుముకూరు లైన్లో మన రాష్ట్ర పరిధిలో మిగిలిపోయిన కేవలం 30 కి.మీ. పనులనూ పూర్తి చేయించలేదు.
కేంద్రం మరోసారి మొండిచెయ్యి.. ఆ రైల్వే ప్రాజెక్టులకు నిధులేవి
YSRCP MPs on National Highway Project :రాష్ట్రానికి జాతీయ రహదారుల ప్రాజెక్టులను వైఎస్సార్సీపీ ఎంపీలు సాధించలేకపోయారు. అనంతపురం-అమరావతి మధ్య 384 కి.మీ. మేర ఎక్స్ప్రెస్వేకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపినా ఆ ప్రాజెక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పడేసింది. దీనికి బదులుగా సత్యసాయి జిల్లా కోడూరు నుంచి పులివెందుల నియోజకవర్గం మీదుగా ప్రకాశం జిల్లా మేదరమెట్ల వరకు కొత్త రహదారి ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అమరావతికి కేంద్రం మంజూరు చేసిన ఓఆర్ఆర్ పనులను ముందుకు సాగనివ్వకుండా చేసి దాని స్థానంలో విజయవాడకు తూర్పు వైపు బైపాస్ను ప్రతిపాదించింది.