ETV Bharat / city

'ప్రత్యేక హోదా పక్కన పెట్టి.. కేసుల మాఫీకి వైకాపా బిజీ'

author img

By

Published : Dec 14, 2019, 2:13 PM IST

ప్రత్యేక హోదా డిమాండ్​ను పక్కన పెట్టి... కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలా అని వైకాపా ప్రయత్నిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల ఆరోపించారు. పార్లమెంటులో వైకాపా ఎంపీలు రాష్ట్ర సమస్యలపై అసలు మాట్లాడటం లేదని విమర్శించారు. దిశ చట్టం మాదిరిగానే.. ఓ చట్టం తెచ్చి జగన్, విజయసాయిరెడ్డి సచ్ఛీలతను నిరూపించుకోవాలని సవాల్ చేశారు.

కనకమేడల రవీంద్రకుమార్
కనకమేడల రవీంద్రకుమార్

మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

ప్రత్యేక హోదాను వైకాపా పక్కన పెట్టిందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. పార్లమెంటులో వైకాపా ఎంపీలు రాష్ట్ర సమస్యలు లేవనెత్తలేదని ఆయన దిల్లీలో అన్నారు. సీఎం జగన్‌, పార్లమెంటరీపక్ష నేతలపై ఉన్న కేసుల వలనే వైకాపా ఎంపీలు ఏం మాట్లాడటం లేదన్నారు. కేసుల నుంచి తప్పించుకోవాలని జగన్ చూస్తున్నారని కనకమేడల ఆరోపించారు. జగన్, విజయసాయిరెడ్డి అవినీతిరహిత వ్యక్తులని నిరూపించుకోవాలని కనకమేడల సవాల్ చేశారు. దిశ చట్టం మాదిరిగానే ప్రత్యేక చట్టం తీసుకొచ్చి తమ సచ్ఛీలతను నిరూపించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగట్లేదని విమర్శించారు. నియంతృత్వ ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు వివరించామన్న ఆయన... ఆరు నెలల జగన్ పాలనతో రాష్ట్రానికి తీవ్రనష్టం జరిగిందని అన్నారు.

ఇదీ చదవండి :

'దిశ బిల్లు ఆమోదించిన రోజే... గుంటూరులో దారుణం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.