లాక్డౌన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఆదేశాలతో ఆయన తనయుడు కరణం వెంకటేష్, మాజీ మంత్రి పాలేటి రామారావు, వైకాపా నాయకుడు అమృతపాణి.. పట్టణంలోని పేదలకు నిత్యావసర వస్తువులు అందించారు.
కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని వైకాపా యువనేత కరణం వెంకటేష్ తెలిపారు.