ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దిల్లీ మద్యం స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు

By

Published : Nov 30, 2022, 8:31 PM IST

Updated : Nov 30, 2022, 10:42 PM IST

kavitha

20:30 November 30

వంద కోట్ల రూపాయల ముడుపులు

దిల్లీ మద్యం స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టు

Delhi liquor scam: దిల్లీ మద్యం కుంభకోణంలో ఆసక్తి కరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా దిల్లీ మద్యం స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును ఈడీ అధికారులు చేర్చారు. అమిత్​ ఆరోరా రిమాండ్​ రిపోర్టులో కవిత పేరును చేర్చినట్లుగా ఈడీ పేర్కొంది. మంగళవారం రాత్రి అమిత్​ ఆరోరాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అలాగే సౌత్​ గ్రూప్​ సంస్థ వంద కోట్ల రూపాయల ముడుపులను చెల్లించినట్లు తేల్చారు. సౌత్​గ్రూప్​ను శరత్​ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించేవారని ఈడీ వెల్లడించింది.

ఈ గ్రూపు ద్వారా రూ. వంద కోట్లను విజయ్​నాయర్​కు చేర్చినట్లు ఈడీ తమ విచారణలో బట్టబయలు చేసింది. ఈడీ చేసిన దర్యాప్తులో అమిత్​ ఆరోరా వాగ్మూలంలో ఈ విషయాలను స్పష్టంగా ధృవీకరించినట్లు రిమాండ్​ రిపోర్ట్​లో పేర్కొన్నారు. 36 మంది రూ. 1.38 కోట్లు విలువ చేసే 170 మొబైల్​ ఫోన్లును ధ్వంసం చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురి 33 ఫోన్లను మాయం చేశారన్నారు. ధ్వంసం చేసిన సెల్​ఫోన్లలో రెండు కవిత నంబర్లు, పది మొబైల్​ ఫోన్​లు వాడినట్లు ప్రకటించారు. ఆమె వాడిన ఈ ఫోన్లు కనిపించకుండా పూర్తిగా ధ్వంసం చేసినట్లు రిమాండ్​ రిపోర్టులో పేర్కొన్నారు.

కుంభకోణంతో ప్రమేయం ఉన్న భాగస్వాములు, అనుమానితుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. సాక్ష్యాధారాలు, ముడుపుల వివరాలున్న డిజిటల్​ డేటాను కూడా పూర్తిగా కనిపించకుండా చేశారని ఈడీ దర్యాప్తులో తేలింది. వీరి వద్దనుంచి కేవలం 17 ఫోన్లను మాత్రమే రికవరీ చేసినట్లు కోర్టుకు వివరించారు. ఈ స్కామ్​లో ఎందరో మద్యం వ్యాపారులు, సీనియర్​ ప్రభుత్వ అధికారులు ఉన్నారని తమ విచారణలో ఈడీ అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుల్లో దిల్లీ ఎక్సైజ్​శాఖ మంత్రి ఒకరుగా ఉన్నారని ఈడీ ప్రకటించింది.

Last Updated :Nov 30, 2022, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details