ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జగన్ పునాదులు కదులుతున్నాయనే ఆందోళనతో టీడీపీ నేతల అక్రమ అరెస్టులు'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 3:01 PM IST

TDP Nara Lokesh Fire on CM Jagan: ముఖ్యమంత్రి జగన్​కు కళ్ల ముందు తన దారుణ ఓటమి కనిపిస్తోందని నారా లోకేశ్ దుయ్యబట్టారు. పులివెందులలో జగన్ పునాదులు కదులుతున్నాయని.. ఈ ఆందోళనతోనే అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.

TDP_Nara_Lokesh_Fire_on_CM_Jagan
TDP_Nara_Lokesh_Fire_on_CM_Jagan

TDP Nara Lokesh Fire on CM Jagan: సీఎం జగన్​కు కళ్ల ముందు తన దారుణ ఓటమి కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రజా విశ్వాసం కోల్పోయారని.. చివరికి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. కడప జిల్లాలో, పులివెందులలో జగన్ పునాదులు కదులుతున్నాయని.. ఈ ఫ్రస్టేషన్​లోనే జగన్ అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.

Lokesh on TDP Incharges Arrest: కడప జిల్లాలో ప్రొద్దుటూరు ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి(Proddutur Incharge Praveen Kumar Reddy), పులివెందుల ఇంఛార్జ్ బీటెక్ రవి అరెస్టు(Btech Ravi Arrest)లతోనే ప్రతిపక్షం అంటే జగన్ ఎంతగా భయపడుతున్నాడో అర్థమవుతోందని లోకేశ్ అన్నారు. పులివెందులలో టీడీపీ స్పీడు పెరగడంతో జగన్ తన మార్క్.. అక్రమ కేసులతో భయపెట్టే చర్యలకు దిగాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రోజుకో నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ అరెస్టు జగన్​లో మొదలైన అలజడికి నిదర్శనమన్నారు.

ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌కు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: నారా లోకేశ్

TDP Nara Lokesh on Farmers Problems in AP: కడప జిల్లాలో, పులివెందులలో తీవ్ర వర్షాభావంతో రైతులు బాధలు పడుతుంటే వారి సమస్యపై దృష్టిపెట్టని సీఎం.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులే తనకు ప్రాధాన్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. సీఎంగా ఉండి సొంత నియోజకవర్గ రైతుల సమస్యలు తీర్చలేని జగన్.. చివరికి పులివెందుల ప్రజల నమ్మకాన్ని కూడా కోల్పోయారని లోకేశ్ అన్నారు. ప్రతిపక్ష నేతల కేసులపై రివ్యూలు పెట్టి మరీ అరెస్టులు చేయిస్తున్న జగన్‌ సర్కారు.. ముందు రైతాంగ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

జాబ్ క్యాలెండ‌ర్‌ పేరుతో జ‌గ‌న్ మాయ‌మాట‌లు న‌మ్మి యువత మోస‌పోయింది: లోకేశ్

ఏ సీఎం అయినా సొంత జిల్లాలో తాను చేసిన అభివృద్ది పనుల గురించో.. కట్టిన ప్రాజెక్టుల గురించో.. తెచ్చిన కంపెనీల గురించో చెప్పుకుంటారని, కానీ జగన్ మాత్రం ఏ నియోజకవర్గంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టాడు అనే అంశాన్ని మాత్రమే చెప్పుకోగలరని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్.. తన సొంత జిల్లాకు కూడా ఏమీ చేయలేకపోయాడని మండిపడ్డారు. తన సైకో చర్యలతో తన పార్టీకి తానే జగన్ రాజకీయ సమాధి కట్టుకున్నారని లోకేశ్ అన్నారు.

ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై వైసీపీ దాడి - రాష్ట్రంలో జగన్ ఫ్యాక్షన్ పాలన : మునిరత్నంపై దాడిని ఖండించిన లోకేశ్

Nara Lokesh on YCP Govt: ఈ అక్రమ కేసులు, బెదిరింపు రాజకీయాలు వైసీపీని బతికించలేవని అన్నారు. అక్రమ పద్ధతుల్లో సహకరిస్తున్న పోలీసులు లేకపోతే రాష్ట్రంలో వైసీపీ అనే పార్టీయే లేదని అన్నారు. జగన్ పెట్టే ప్రతి కేసు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతుందన్నారు. ప్రజల పక్షాన తమ పోరాటాన్ని ఆపదని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details