ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం జగన్ మత్స్యకారులను అణచివేస్తున్నారు: కొల్లు రవీంద్ర

By

Published : Nov 21, 2022, 4:25 PM IST

tdp leader kollu Ravindra

KOLLU RAVINDRA SPECIAL PUJA IN VIJAYAWADA : మత్స్యకారులకు మేలు జరగాలని కోరుకుంటూ.. టీడీపీ నేత కొల్లు రవీంద్ర విజయవాడ కృష్ణా నదిలో గంగమ్మ తల్లికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సీఎం జగన్.. అధికారంతో మత్స్యకారులను అణచివేస్తున్నారని ఆయన విమర్శించారు.

KOLLU SPECIAL PUJA ON WORLD FISHERMAN DAY : ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా విజయవాడలోని దుర్గమ్మ ఘాట్ వద్ద టీడీపీ నేత కొల్లు రవీంద్ర గంగమ్మ తల్లికి పూజలు చేశారు. మృత్య్సకారులకు మంచి జరగాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేసి.. చీర, సారె అందించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మత్స్యకారులకు అనేక ప్రత్యేక పథకాలు అందించి.. వారి అభ్యున్నతికి విశేష కృషి చేశామని తెలిపారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. గంగమ్మ తల్లి దీవెనలతో మత్స్యకారులకు ఈ సంవత్సరం అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ పూజలో మత్య్సకార సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details