ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గడువు ముగిసింది... అయినా ఆమె నామినేషన్ వేయగలిగింది

By

Published : Mar 12, 2020, 11:27 PM IST

వైకాపా నేతలు అడ్డుకున్న కారణంగా నిన్న గుంటూరు జిల్లా పాలపాడు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయలేక పోయిన తెదేపా అభ్యర్థి.. ఇవాళ నామపత్రాలను సమర్పించారు. స్థానిక డీఎస్పీ ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు.

నేడు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్
నేడు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్

గుంటూరు జిల్లా పాలపాడు ఎంపీటీసీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా పులిమి ప్రతిభా భారతి నేడు నామినేషన్ దాఖలు చేశారు. నిన్న నామినేషన్ దాఖలు చేయటానికి బయల్దేరిన ఆమెను వైకాపా నాయకులు అడ్డుకుని దాడి చేశారు. ఈ ఘటనపై ఆర్డీవో వెంకటేశ్వర్లకు ప్రతిభా భారతి ఫిర్యాదు చేశారు. అనంతరం నామపత్రాలు దాఖలు చేయటానికి ఎంపీడీవో కార్యాయానికి వెళ్లగా అప్పటికే సమయం దాటిపోయిందని ఎన్నికల అధికారులు ఆమెను వెనక్కి పంపించేశారు. ఈ ఘటనపై వారు ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేయగా.. నామపత్రాలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు నరసరావుపేట ఎన్నికల అధికారికి.. పోలీసుల సమక్షంలో ప్రతిభాభారతి పత్రాలు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details