ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆస్తి కోసం బావ మాస్టర్ ప్లాన్.. బావమరిదిని చంపేసి..

By

Published : Aug 4, 2022, 8:41 AM IST

ఆస్తి కోసం బావ మాస్టర్ ప్లాన్

Murder: బావమరుదులు బావ బతుకు కోరతారంటారు. అలాంటి బావమరిదిని ఆస్తి కోసం దారుణంగా హత్య చేశాడు ఓ బావ. 13 ఎకరాల పొలం కోసం 15 ఏళ్ల బాలుడిని చంపేసి మూడో కంటికి తెలియకుండా పూడ్చి పెట్టాడు. దాదాపు 70 రోజుల తర్వాతగానీ మిస్టరీ వీడలేదు.

ఆస్తి కోసం బావ మాస్టర్ ప్లాన్

Boy Murder For Property:అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన అఖిల్ మే 21న తిమ్మప్పస్వామి జాతరకు వెళ్లి అదృశ్యమయ్యాడు. రోజు గడిచినా తిరిగిరాలేదు. మే 22న అఖిల్‌ తల్లి శారదమ్మ.. తన కుమారుడు కనిపించటంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు దాదాపు 70 రోజుల తర్వాత అఖిల్‌ ఇక లేడని తేల్చారు.

శారదమ్మకు అఖిల్‌తోపాటు.. వర్షిత, త్రిష అనే ముగ్గురు సంతానం. వర్షితను 8 నెలలక్రితం గుద్దేళ్ల గ్రామానికి చెందిన అనిల్‌కు ఇచ్చి పెళ్లిచేశారు. కొన్నిరోజుల తర్వాత అనిల్‌ కన్ను.. అత్త ఆస్తిపై పడింది. ఆమెకు ఉన్న 13 ఎకరాలు తన సొంతమవ్వాలంటే బావమరిది అఖిల్‌ను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. సెల్‌ఫోన్‌ ఇప్పిస్తానంటూ అఖిల్‌ను బైక్‌ ఎక్కించుకున్నాడు. తన పొలం పక్కనే ఉన్న వంకలోకి తీసుకెళ్లాడు. అఖిల్ కాళ్లు, చేతులు వైర్‌తో కట్టేసి మెడపై కొడవలితో వేటు వేశాడు. అనంతరం అక్కడే గుంతలో పూడ్చేశాడు.

ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టే అనిల్‌ ఇంటికి వెళ్లిపోయాడు. కొన్నిరోజులు అలాగే నటించాడు. ఊళ్లోనే ఉండి పోలీసుల విచారణను పసిగట్టాడు. విచారణ అటు తిరిగి ఇటు తిరిగి తనవైపు వస్తోందని గ్రహించి నెల క్రితం అనిల్‌ పరారయ్యాడు. అఖిల్‌ను ఆఖరిసారి అనిల్‌ బైకుపై చూసినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పడం.., అదే సమయంలో అనిల్‌ పరారవడంతో పోలీసుల అనుమానం బలపడింది. చివరకు రైల్వే స్టేషన్‌లో ఉండగా... అనిల్‌ను పోలీసులు పట్టుకున్నారు. అఖిల్‌ ఏమయ్యాడని ప్రశ్నించగా.. అసలు విషయం కక్కాడు. పోలీసులను తీసుకెళ్లి ఇదిగో ఇక్కడే పూడ్చిపెట్టానని చెప్పాడు. పోలీసులు అక్కడ తవ్వించగా.. ఎముకలు, వైరుతోపాటు బాలుడి చొక్కా లభించాయి. వాటి ఆధారంగా మృతదేహాన్ని నిర్థరించుకున్నారు. ఆస్తి కోసం తన అల్లుడు ఇంత ఘాతుకానికి తెగిస్తాడనుకోలేదంటూ బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలిపించింది.

ఇవీ చూడండి

TAGGED:

ABOUT THE AUTHOR

...view details