అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామ సమీపంలో వాగు దాటుతూ ప్రమాదవశాత్తు గల్లంతైన రామసుబ్బమ్మ మృతదేహాన్ని రెండు రోజుల తర్వాత వరదాయిపల్లి చెక్ డ్యాంలో గ్రామస్థులు గుర్తించారు.
పింఛన్ కోసం వెళ్తూ..
వరదాయిపల్లికి చెందిన రామసుబ్బమ్మ ఈ నెల 1న పింఛన్ తీసుకునేందుకు తాడిపత్రి నుంచి వరదాయిపల్లి గ్రామానికి వెళ్తూ ప్రమాదవశాత్తు చుక్కలూరు గ్రామ సమీపంలోని వాగు దాటుతూ నీటి ప్రవాహంలో పడిపోయింది. బాధితురాలిని రక్షించేందుకు స్థానిక యువత ఎంత శ్రమించినా వృద్ధురాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.