ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వినియోగదారుల చెంతకే డీజిల్.. విశాఖలో ఓ బంక్ బంపర్ ఆఫర్

By

Published : Aug 9, 2021, 6:05 PM IST

చమురు కంపెనీలు ఇప్పుడు డీజిల్ ను నేరుగా వినియోగదారుల వద్దకే పంపేందుకు శ్రీకారం చుట్టాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్​కు చెందిన విశాఖ షీలా నగర్ పెట్రోల్ బంక్ తొలిసారిగా ఈ తరహా వెసులుబాటుకు తెర తీసింది.

విశాఖలో వినియోగదారుల వద్దకే చమురు
విశాఖలో వినియోగదారుల వద్దకే చమురు

చమురు కంపెనీలు.. డీజిల్ ను నేరుగా వినియోగదారుల వద్దకు పంపేందుకు శ్రీకారం చుట్టాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్​కు చెందిన విశాఖ షీలా నగర్ పెట్రోల్ బంక్.. తొలిసారిగా ఈ తరహా వెసులుబాటుకు చర్యలు తీసుకుంది.

ఈ సరఫరాకు అవసరమైన భద్రతా ధ్రువీకరణ, ఇతర అనుమతులను తీసుకున్నట్టు బంక్ యాజమాన్యం వెల్లడించింది. ఇందుకోసం కొన్ని వాహనాలను సిద్ధం చేశారు. ఈ సదుపాయాన్ని విశాఖ ఎమ్మెల్సీ మాధవ్ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details