12:17 June 21
ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ నోటీసులు
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రావాలని సీఆర్పీసీ సెక్షన్ 41(ఎ) కింద నోటీసులిచ్చారు. విజయవాడ సీబీఐ క్యాంపు కార్యాలయంలో రేపు ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే అంశంలో గతంలోనూ విశాఖలో సీబీఐ ఎదుట ఆమంచి హాజరయ్యారు.
ఇవీ చూడండి
Last Updated :Jun 21, 2022, 1:25 PM IST