- తెనాలిలో దారుణం.. మూగ యువతిపై అత్యాచారం
Rape on Dumb young woman in Tenali: రాష్ట్రంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తరచుగా ఏదోఒక ప్రాంతంలో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో మాటలు రాని యువతిపై అత్యాచారం జరిగింది. జకరయ్య అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఆరోపించారు.
- తిరుమలలో ఏనుగుల సంచారం.. భయాందోళనలో భక్తులు
Elephants at Tirumala: తిరుమలలో మరోసారి ఏనుగులు కలకలం సృష్టించాయి. పార్వేట మండపం వద్ద డివైడర్లు, పిట్టగోడను ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.
- పులిచింతలలో గేటు కొట్టుకుపోయి 9 నెలలైనా.. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
Pulichintala Gate: బటన్ నొక్కుతున్నాం.. ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తున్నాం. ఇదీ ఈ మధ్య ప్రతీ సభలో ముఖ్యమంత్రి జగన్ వేస్తున్న రికార్డు.! మూడేళ్లలో రూ. లక్షా 40 వేల కోట్లు పంచామని ఢంకా బజాయిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. కృష్ణా డెల్టాకు బ్యాలెన్సింగ్ జలాశయంగా ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 9 నెలల్లో ఏడంటే ఏడు కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయారు.
- కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ?
Priyanka Gandhi congress president: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టేందుకు రాజస్థాన్లోని ఉదయ్పుర్లో నవసంకల్ప్ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఆరు కమిటీలు కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించాలనే అంశం తెరపైకి వచ్చింది.
- భారత్లో తగ్గిన కరోనా కేసులు.. కొరియాలో 8.2లక్షలు!
Coronavirus Update India: దేశంలో ఒక్కరోజే 2,487 మందికి వైరస్ సోకింది. మరో 13 మంది చనిపోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.84 శాతానికి చేరింది. ఒక్కరోజే నమోదైన కేసుల కంటే.. కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం.
- ఆ రోజు చనిపోతాననుకున్నా: గౌతమ్ అదానీ
Gautam Adani: దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీపడుతున్నారు గౌతమ్ అదానీ. పలు వ్యాపార కార్యకలాపాల వెనుక తనదైన ముద్రవేసిన అదానీ తన మనసులోని ముచ్చట్లను పంచుకున్నారు. 2008, నవంబర్ 26న ముంబయిలోని తాజ్ హోటల్లో భోంచేస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారని, ఆ క్షణాన చావును చాలా దగ్గర నుంచి చూశానని చెప్పారు.
- కామెర్లు ఉన్నవారితో సెక్స్ ప్రమాదకరమా?
Jaundice Sexually Transmitted : కామెర్లు ఉన్న వాళ్లు సెక్స్లో పాల్గొనవచ్చా? పాల్గొంటే వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తుంటాయి. వాటన్నింటికీ డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- సెల్ఫోన్ వినియోగంలో మన పిల్లలే టాప్!
Mcafee Survey 2022: భారత్లో పదిహేనేళ్ల లోపు వయసు పిల్లల్లో స్మార్ట్ఫోన్ వినియోగం 83 శాతంగా ఉందని కంప్యూటర్ భద్రత సాఫ్ట్వేర్ సంస్థ 'మెకాఫే' నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 10-14 ఏళ్ల వయసులోనే సెల్ఫోన్ వినియోగంలో ప్రపంచ సరాసరి కన్నా 7 శాతం అధికంగా ఉందని తాజా సర్వేలో వెల్లడైంది.
- IPL: ధోనీ తర్వాత సీఎస్కే నెక్ట్స్ కెప్టెన్ అతడేనట!
Sehwag on IPL CSK Captain: సీఎస్కే కెప్టెన్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయగలిగే ఆటగాడెవరో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పేశాడు. అంతేకాదండోయ్.. ధోనీలా సుదీర్ఘకాలంపాటు నాయకత్వ బాధ్యతలను నిర్వహించగలిగే సత్తా కూడా ఆ యువ క్రికెటర్లో ఉందట.. ఇంతకీ అతడెవరో తెలుసా..?