ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : Jul 3, 2022, 9:00 AM IST

.

TOP NEWS
ప్రధాన వార్తలు

  • రేపు భీమవరానికి ప్రధాని.. 16 ఎకరాల్లో సభా ప్రాంగణం
    Modi tour in Bheemavaram: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు.. ఏర్పాట్లు శరవేగంగా సాగతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపాన ఉన్న కాళ్ల మండలం పెదఅమిరంలో.. 16 ఎకరాల్లో భారీ వేదిక ఏర్పాటైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోండి: హైకోర్టు
    HC orders to CS: ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈనెల 4న అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో.. కార్యక్రమానికి హాజరుకానున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పర్యటనలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని/ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Bogus votes : ఆ పంచాయతీలో భారీగా బోగస్ ఓట్లు.. ఆ జాబితాతోనే ఎన్నికలు!
    రెవెన్యూ అధికారులతో కలిసి ఓ వైకాపా నాయకుడు భారీగా బోగస్ ఓట్లను జాబితాలో చేర్చారు. ఆ తరువాత అదే ఓటరు జాబితాతో పంచాయతీ ఎన్నికలూ జరిగిపోయాయి. తాజాగా వైకాపా నాయకుల్లో తలెత్తిన వర్గ విభేదాల కారణంగా.. ఈ ‘బోగస్‌’ వ్యవహారాన్ని బయటపెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దినపత్రిక కొనుగోలుకు ..వాలంటీర్లకు డబ్బులు
    రాష్ట్రంలో దినపత్రిక కొనుగోలుకు గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రతి నెల 200 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 29న వైకాపా ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా విస్తృతమైన సర్క్యులేషన్‌ కలిగిన దినపత్రిక కొనుక్కొనేందుకు 200 రూపాయలు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రజల్లోనే ఉందాం.. ఎన్నికేదైనా గెలుద్దాం.. నేతలకు మోదీ పిలుపు
    BJP meet in Hyderabad: ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను, విపక్షాల విధ్వంసకర విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతోపాటు ఎన్నికలపై మరింత దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో అనుసరించే వైఖరి గురించి చర్చ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని ఎన్నికలపై మరింత దృష్టి పెట్టి పని చేయాలని సూచించినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాష్ట్రపతి రబ్బర్‌ స్టాంపేనా?.. అసలీ పేరెలా వచ్చింది?
    PRESIDENT RUBBER STAMP: 'రాష్ట్రపతి- రబ్బర్ స్టాంప్'.. ఈ జంట పదాలు మనం తరచుగా వినే ఉంటాం. రాష్ట్రపతి పదవి అంటే రబ్బర్ అన్న పేరు చాలా కాలంగా ఉంది. అయితే, ఇది ఎప్పుడు మొదలైంది? ఎందుకీ పేరు వచ్చింది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 86 ఏళ్ల వయసులో.. గిన్నిస్ రికార్డు సాధించిన బామ్మ
    Bette Nash: సాధారణంగా 60 ఏళ్లు దాటగానే చాలా మంది రిటైర్మెంట్ తీసుకుని విశ్రాంత జీవితం గడపాలనుకుంటారు. కానీ ఈ బామ్మ ఎనిమిది పదుల వయసులోనూ ఎంతో చలాకీగా ఉద్యోగం చేస్తోంది. అది ఏ చిన్నా చితకా సంస్థలో మామూలు ఉద్యోగం కాదండోయ్‌.. ఓ పేద్ద విమానయాన సంస్థలో ఎయిర్‌హోస్టస్‌గా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మార్కెట్లు క్రాష్: ఆ ఒక్కటి చూసి షేర్లు కొనొద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్!
    stock market losses: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది భారీగా నష్టాలను చవిచూశాయి. రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, అధిక చమురు ధరలు, విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వల్ల కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'అది ప్లాన్​ కాదు.. బౌలర్లను మానసికంగా దెబ్బ తీసేందుకే అలా ఆడా'
    ఇంగ్లాండ్​తో భారత్​ ఆడుతున్న రీషెడ్యూల్డ్​ టెస్టు.. తొలి ఇన్నింగ్స్​లో చెలరేగి ఎన్నోరికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు టీమ్​ఇండియా ఆటగాడు రిషభ్​ పంత్. ఇంగ్లాండ్​ బౌలర్లను మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎదురు దాడి చేశానని పంత్​ తెలిపాడు. ముందస్తు ప్రణాళికేం కాదని వివరించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'మాది 'పాన్​ తెలుగు' సినిమా.. వందమంది ఒకేసారి నవ్వుకోవడంలో ఆ కిక్కే వేరు'
    తెలుగు సినీ పరిశ్రమకు 'మత్తు వదలరా' చిత్రంతో పరిచయమైన దర్శకుడు రితేశ్​ రాణా. లావణ్య త్రిపాఠి హీరోయిన్​గా ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం 'హ్యాపీ బర్త్​డే' జులై 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను వివరించారు. అవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details