ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్​పై విచారణ.. ఏపీ ప్రభుత్వం, తెదేపాకు నోటీసులు

By

Published : Oct 27, 2020, 2:52 PM IST

గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూకేటాయింపుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వంతోపాటు తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. సీఆర్డీఏ నిబంధనలు ఉల్లంఘిస్తూ తెదేపాకు భూమిని కేటాయించారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్​ దాఖలు చేశారు.

supreme court
supreme court

గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూకేటాయింపుపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారించింది. ఏపీ ప్రభుత్వం, తెదేపాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం... 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. భూకేటాయింపులో సీఆర్‌డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని ఈ పిటిషన్ దాఖలైంది. నీటివనరులతో సంబంధం ఉన్న భూమిని కేటాయిస్తూ 2017లో జీవో జారీ చేశారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details