ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Sep 7, 2022, 7:07 PM IST

ఏపీ ప్రధాన వార్తలు

7Pm Top News
ఏపీ ప్రధాన వార్తలు

  • AP Cabinet Decisions: ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..
    AP Cabinet Decisions: సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. మరికొన్ని అంశాలపై మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. అవేంటంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Students Fight: గ్రూపులుగా విడిపోయి విద్యార్థుల ఫైట్​.. ఎక్కడంటే..?
    Students Fighting: చదువుకుంటారని పిల్లలను తల్లిదండ్రులు కాలేజీలకు పంపితే.. విద్యార్థులు మాత్రం చదువును పక్కన పెడుతున్నారు. సినిమాల ప్రభావమో ఏమోగానీ గ్రూపులుగా ఏర్పడి.. ఫైటింగ్​లు చేస్తున్నారు. పలమనేరులోని ఓ కాలేజీలో విద్యార్థులు గొడవపడ్డారు. గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడి చేసుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • Minister Botsa on CPS: పరిశీలిస్తే.. సీపీఎస్​ రద్దు సాధ్యం కాదని తేలింది: మంత్రి బొత్స
    Minister Botsa on CPS: సీపీఎస్​పై ఇప్పటివరకు తమతో వారి ఇంట్లో జరిగిన భేటీలు అనధికారికమేనని మంత్రి బొత్స అన్నారు. కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉందని... ఉద్యోగ సంఘాలు రాకపోతే సీపీఎస్​ను అంగీకరిస్తున్నట్లు భావిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Student Suicide: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య..ఎందుకంటే..!
    Student suicide: ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్​ జోడో యాత్ర షురూ.. రాహుల్​ నేతృత్వంలో దేశమంతా..
    Bharat Jodo Yatra : 2024 సార్వత్రిక ఎన్నికలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ 'భారత్ జోడో' యాత్ర మొదలైంది. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ వరకు తలపెట్టిన యాత్రను ప్రారంభించారు. 12 రాష్ట్రాల నుంచి 3,570 కిలోమీటర్ల పొడవున ఈ పాదయాత్ర సాగనుంది. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం సహా దేశంలో భాజపాయేతర శక్తులను కూడగట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'దేశంలో ఎన్నో సవాళ్లు.. రాహుల్​ అధ్యక్షుడైతేనే సాధ్యం'
    Ashok Gehlot On Bharat Jodo Yatra : దేశం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడైతే వాటిని ఎదుర్కోవటం సులభమవుతుందని అన్నారు రాజస్థాన్ సీఎం అశోక్‌ గహ్లోత్‌. కాంగ్రెస్‌ తలపెట్టిన భారత్‌జోడో యాత్ర ప్రారంభానికి ముందు మాట్లాడిన ఆయన.. రాహుల్‌ నాయకత్వంలో తామంతా పనిచేయనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇద్దరు యువకులపై 20మంది ఆర్మీ అభ్యర్థుల మూక దాడి.. కర్రలతో కొట్టి.. రాళ్లు రువ్వి..
    మధ్యప్రదేశ్​లోని మోరెనా నగరంలో ఉన్న అంబేద్కర్​ స్టేడియంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇద్దరు యువకులపై సుమారు ఇరవైమందికి పైగా ఆర్మీ ఉద్యోగార్థులు కర్రలతో దాడి చేశారు. వద్దని ప్రాధేయపడుతున్నా వినిపించుకోకుండా వెంటాడి మరీ గాయపరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కార్పొరేట్‌ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
    వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, కార్పొరేట్లు తమ డిపాజిట్‌ రేట్లను సవరించడం ప్రారంభించాయి. ముఖ్యంగా కార్పొరేట్‌లు తమ నిధుల అవసరాల కోసం స్వల్పకాలిక డిపాజిట్లను ప్రకటించడం ప్రారంభించాయి. అధిక వడ్డీ వస్తుందని వీటిని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎవరీ బ్యూటీ.. అర్షదీప్​ బౌలింగ్​కు ఫిదా.. పెళ్లి చేసుకోవాలంటూ..
    Arshdeep marriage proposal ఆసియా కప్​లో భాగంగా ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ పేసర్ అర్షదీప్ సింగ్ కీలక క్యాచ్​ను మిస్ చేసి విమర్శల పాలయ్యాడు. దీంతో సోషల్​మీడియాలో ఎక్కడ చూసినా అతడి గురించే వార్తలు కనిపించాయి. అయితే ఇప్పుడు మరోసారి అతడు వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే ఓ అందాల ముద్దుగుమ్మ అతడి బౌలింగ్​ పట్ల ఫిదా అయింది. సోషల్​మీడియా వేదికగా అతడిని ప్రపోజ్​ చేసి పెళ్లి చేసుకోమని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • RRR: ఈ మ్యాజిక్​ చూశారా.. ఒరిజినల్​కు, సినిమాలో చూసినదానికి ఇంత తేడానా?
    ఆర్​ఆర్​ఆర్​లోని మరో మాయాజాలం గురించి బయటపెట్టారు మేకర్స్​. దానికి సంబంధించిన ఫొటో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. దాన్ని మీరు చూసేయండి.. పూర్తివివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details