రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21,360 మంది నమూనాలు పరీక్షించగా 117 కొత్త కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారిన పడి విశాఖలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 241 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,961 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది.