ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంగన్వాడీల 'చలో విజయవాడ'కు అనుమతి లేదు - అరెస్టులకు రంగం సిద్ధం: సీపీ కాంతిరాణా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 5:59 PM IST

Anganwadis Chalo Vijayawada: అంగన్వాడీలు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ కాంతిరాణా తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 41 రోజులుగా అంగన్వాడీలు తమ సమస్యలు నెరవేర్చాలని కోరుతూ ధర్నా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అంగన్వాడీ నేతల దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. డిమాండ్ల పరిష్కారం కోసం కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని అంగన్వాడీలు తలపెట్టారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఛలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. అంగన్వాడీలు చేపట్టే నిరసన కార్యక్రమానికి అనుమతులు లేవని సీపీ తెలిపారు. ఇప్పటికే ఎస్మా కూడా అమల్లో ఉందని సీపీ గుర్తు చేశారు. 506, 120బి తోపాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే మరింత కఠినంగా వ్యవరిస్తామని సీపీ అన్నారు. ముందస్తుగా నేతలను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి రేపు అంగన్వాడీలు ఎవరూ ఛలో విజయవాడ కార్యక్రమానికి రావద్దని సీపీ కాంతిరాణా కోరారు.

ABOUT THE AUTHOR

...view details