ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రావులపాలెం కొత్త వంతెనపై రోడ్డు ప్రమాదం- ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 9:51 AM IST

Road Accident in Ravulapalem New Bridge: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని గౌతమి కొత్త వంతెనపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో టిప్పర్ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం వైపు నుంచి ఎరువుల లోడుతో  లారీ రావులపాలం వైపు వెళ్తుండగా కొత్త వంతెన దిగువకి వచ్చేసరికి మరమ్మతుల కారణంగా ఆగిపోయింది. 

డ్రైవర్, క్లీనర్ లారీ కిందకు వెళ్లి మరమ్మతులు చేస్తుండగా రాజమహేంద్రవరం వైపు నుంచి గ్రావెల్ లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో కింద డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ లారీలో ఉన్న డ్రైవర్ జిత్తుగ రవి, క్లీనర్ ఎల్లే మణికుమార్ లారీ క్యాబిన్​లో ఇరుక్కుపోయారు. రెండు లారీలను హైవే పోలీసు సిబ్బంది క్రేన్ల సహాయంతో తొలగించారు. పోలీసులు, స్థానికుల సహాయంతో అతి కష్టం మీద లారీలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను అంబులెన్స్​లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details