ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దైవదర్శనం వేళ విషాదం- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 1:25 PM IST

road_accident_in_anakapally_district

Road Accident in Anakapally District : అనకాపల్లి జిల్లా జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలుకి చెందిన 12 మంది కుటుంబ సభ్యులు కారులో దైవదర్శనాలకు బయల్దేరారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి, శ్రీకూర్మం ఆలయాలను సందర్శించుకుని అనంతరం అన్నవరం వెళ్లేందుకు వాహనాల్లో బయలుదేరుగా ఏడుగురు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం వాహనం టైరు పేలి డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు సహా మూడేళ్ల బాలుడు మృతి చెందాడు.  ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన కుమారి సత్యవతి తోటి కోడలు కాగా బాలుడు సత్యవతి మానవుడు అభిరామ్​గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదం మునిగిపోయారు. దైవ దర్శనానికి వెళ్తూ సంతోషంగా గడుపుతున్న వారి జీవితాలు కన్నీరు మున్నీరయ్యాయని మృతుల బంధువులు విలపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details