ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్డీఏ కూటమికి లోక్​సత్తా మద్దతివ్వడం ఆనందదాయకం: నాదెండ్ల మనోహర్ - Jaya prakash Narayana Support NDA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 7:38 PM IST

Nadendla Manohar Thanks to Jaya Prakash Narayana : రాష్ట్ర ప్రజల భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ మద్దతు తెలపడం ఆనందదాయకమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. లోక్ సత్తా నాయకుడు భీశెట్టి బాబ్జి రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం తెనాలిలో పర్యటించారు. ఈ సందర్భంగా మనోహర్​ను ఆయన కలిసి అభినందనలు తెలిపారు. 

Jaya Prakash Narayana For Supporting NDA Alliance : తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా జయప్రకాశ్ నారాయణ సమాజంలో మార్పుల కోసం లోక్​సత్తా ఉద్యమ సంస్థ ద్వారా అనేక చర్యలు చేపట్టారన్నారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత కల్పించేలా జయప్రకాశ్ నారాయణ పోరాట స్ఫూర్తి నిలిచిందన్నారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్​కి ఆయన స్వచ్ఛందంగా నిలవడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమికి మద్దతు తెలిపినందుకు ఆయనకు మనోహర్ ధన్యవాదాలు తెలిపారు. 

లోక్ సత్తా నేత బాబ్జి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి మత్తు రాష్ట్రంగా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కు యావత్ ప్రజానీకం ముందుకు రావాలన్నారు. యువత భవిష్యత్తు కోసం రాజకీయాల్లో మార్పు రావడం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details