ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీ నేత కారు షెడ్డులో అక్రమ మద్యం- స్వాధీనం చేసుకున్న పోలీసులు - illegal liquor in chittoor district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 11:00 PM IST

Illegal liquor in Chittoor District : చిత్తూరు డెప్యూటీ మేయర్‌ రాజేష్‌ కుమార్‌రెడ్డికి చెందిన కారు షెడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 140 కేసుల కర్ణాటక మద్యం విలువ దాదాపు 11 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కొంగారెడ్డిపల్లిలోని కారు పార్కింగ్ షెడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారు షెడ్డు నగర ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి కి చెందినదిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు, ఎన్నికల ప్రత్యేక నిఘా విభాగం అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది అధికార వైసీపీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఇంలాంటి వాటిని అరికట్టడం కోసం ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ ని సైతం నియమించింది. రోజుకు వందల సంఖ్యలో సువిధ యాప్​లో వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న ప్రలోభాలు మాత్రం తగ్గటం లేదు. ప్రతిపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నప్పటికి వైసీపీ నేతల్లో మార్పురావటం లేదు. 

ABOUT THE AUTHOR

...view details