ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మరో 9 మందికి జనసేన గ్రీన్ సిగ్నల్ - అభ్యర్థులతో పవన్ భేటీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 11:27 AM IST

JanaSena Chief Pawan Kalyan Selecting MLA Candidates: టీడీపీ, బీజేపీలతో పొత్తులు, పోటీ చేసే సీట్ల వివరాలు కొలిక్కి రావడంతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి నియోజకవర్గాల అభ్యర్థులను పిలిపించుకుని మాట్లాడారు. ఇప్పటికే ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ తాజాగా మరో 9 మందికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది.

pawan_kalyan
pawan_kalyan

JanaSena Chief Pawan Kalyan Selecting MLA Candidates:తెలుగుదేశం, బీజేపీతో పొత్తులు, పోటీ చేసే సీట్ల వివరాలు కొలిక్కి రావడంతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెస్తున్నారు. ఇప్పటికే ఆరుస్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన ఆయన బుధవారం రాత్రి మరో 9 మందికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి నియోజకవర్గాల అభ్యర్థులను పవన్‌ పిలిపించుకుని మాట్లాడారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర గతిని మారుస్తాయని పవన్ కల్యాణ్ చెప్పారు. అరాచకాన్ని, హింసను, కక్ష సాధింపునీ నమ్ముకున్న పార్టీతో ఎన్నికల్లో పోరాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నేతలకు సూచించారు. కచ్చితంగా గెలిచి తీరాలని ఉద్బోధించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ప్రతిదశలోనూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సిద్ధం, సిద్ధం అని కోకిలలా కూస్తున్న వ్యక్తికి యుద్ధమే ఇద్దాం: పవన్ కల్యాణ్

అభ్యర్థిత్వాలకు ఆమోదం: ఈ క్రమంలో కార్యాలయానికి వచ్చిన వారితో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేశ్‌, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్‌, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణయాదవ్‌లను పిలిచి మాట్లాడి ప్రచారం చేసుకోవాలని చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్‌, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్‌, భీమవరం నుంచి ఇటీవల పార్టీలో చేరిన పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి దేవవరప్రసాద్‌ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులుతో భేటీ అయ్యారు. దాదాపుగా ఈ స్థానం కూడా ఖరారైనట్లేనని చెబుతున్నారు. ఇప్పటికే జనసేన తరఫున నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌, కాకినాడ రూరల్​ నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జనసేన కార్యాలయానికి వీరు రాగా పవన్‌కల్యాణ్‌ విడివిడిగా సమావేశమై ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై చర్చించారు. ఎన్నికలకు సంబంధించిన విధివిధానాలపై సమాచారాన్ని వారికి అందించారు.

బాబు, మోదీ మధ్యలో పవన్​!- ఆ విషయంలో జనసేనాని వ్యూహాత్మక అడుగులు

కచ్చితంగా గెలిచి తీరాలి: జరగబోయే ఎన్నికలు రాష్ట్ర గతిని మారుస్తాయని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోరాడుతున్నది హింస, కక్ష సాధింపు, అరాచకాలు చేస్తున్న పార్టీతో అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఈ సారి కచ్చితంగా గెలిచి తీరాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ప్రచారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేతలకు పవన్ వివరించారు. ప్రతి దశలోనూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి తాను సేకరించిన, వివిధ సర్వేల ద్వారా వచ్చిన సమాచారంలోని ముఖ్య అంశాలూ వారికి తెలియజేశారు.

9 మందికి సమాచారం: ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఆరు స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా పవన్ కల్యాణ్​ ప్రకటించారు. తాజాగా మరో 9 మందికి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది. ఇవికాక కాకినాడ జిల్లాలోని పిఠాపురం, కోనసీమ జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, విజయనగరం జిల్లాలోని పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు, ఏలూరు జిల్లాలోని పోలవరం స్థానాల్లో ఆరు చోట్ల పోటీచేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమను మరచిపోవాల్సిందే !: పవన్‌ కల్యాణ్‌

తిరుపతికి చెందిన గంటా నరహరికి పవన్‌కల్యాణ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. తిరుపతి శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని నరహరి కోరుకుంటున్నారు. అయితే ఆరణి శ్రీనివాసులుతో మాట్లాడి సానుకూల సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. మరో వైపు అమలాపురం స్థానం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, డీఎంఆర్‌ శేఖర్‌ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అవనిగడ్డ నుంచి పోటీకి బండ్రెడ్డి రామకృష్ణ, తిరుపతి శ్రీనివాసరావు, మాదివాడ వెంకట కృష్ణాంజనేయులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా పాలకొండ నుంచి పోటీకి పార్టీ ఇన్‌ఛార్జి నిమ్మల నిబ్రం, ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసిన తేజోవతి, ఎస్‌బీఐ విశ్రాంత మేనేజర్‌ కోరంగి నాగేశ్వరరావు తదితరులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రైల్వే కోడూరు నుంచి డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, మురళి పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details