కారు విషయంలో గొడవ నడిరోడ్డుపై భార్యాభర్తలను చితకబాదిన యువకులు

By

Published : Oct 29, 2022, 7:45 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

thumbnail

రాజస్థాన్​లోని జైపుర్​లో జరిగిన ఓ గొడవలో కొందరు యువకులు గర్భిణి అని కనికరం లేకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. ​ అక్టోబర్​ 25న సతీశ్​ అనే వ్యక్తి గర్భిణి అయిన తన భార్య, కుమార్తెతో కలిసి కారులో డిన్నర్​కు వెళ్లారు. అనంతరం వారు తిరిగి వస్తుండగా సతీశ్​ కారును మరో కారు ఢీకొట్టింది. ఈ విషయంలో సతీశ్​ కుటుంబానికి, కారులో ఉన్న యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన యువకులు ఆ భార్యాభర్తలతో పాటు చిన్నారిపై కూడా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతున్నామన్నారు.

Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.