'రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రానికి - ఏటా ఆర్టీసీకి రూ.2000 కోట్లు చెల్లించడం లెక్కకాదు'

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 9:07 PM IST

thumbnail

RTC Employees Union General Secretary Raji Reddy Interview : తెలంగాణలో ఆర్టీసీ బస్సులో రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడంతో సంస్థకు ఎలాంటి కష్టం, నష్టం కానీ ఉండదని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో లాభం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిరోజు పది లక్షల మంది వరకు మహిళలు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. ప 

Rajireddy on Telangana RTC Free Travel : రోజుకు మూడు నుంచి నాలుగు కోట్లు రూపాయలు వరకు ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పారు. ఏటా రూ.1500 కోట్లు నుంచి రూ.2000 కోట్లు వరకు నిధులు అయితే సరిపోతుందంటున్న ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డితో ఈటీవీ భారత్‌ ముఖాముఖి.

'రాష్ట్రంలో రోజుకు 45 లక్షల మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. వారిలో మహిళలు 50 శాతం మంది ఉన్నారు. అంటే దాదాపు 22 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వారిలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవారు 10 లక్షల మంది ఉన్నారని' ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తెలిపారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.