ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ నేతలు బీఆర్ఎస్​పై ఆరోపణలు చేస్తున్నారు : మంత్రి పువ్వాడ అజయ్​కుమార్

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 4:32 PM IST

thumbnail

Minister Puvvada Comments on Congress : ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ నేతలు బీఆర్ఎస్​పై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విమర్శించారు. సోమవారం ఖమ్మంలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లపై స్థానిక నేతలతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలోనే దేశం సర్వనాశనమైందని ఆరోపించారు. ఇసుక, భూ మాఫియాలకు పాల్పడింది హస్తం నేతలే అని ధ్వజమెత్తారు.

విచక్షణ కోల్పోయినట్లు కనిపిస్తున్న కాంగ్రెస్​ నేతల మాటలే బీఆర్​ఎస్ గెలుపునకు పునాది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా సభా ఏర్పాట్లు చేయాల్సి వస్తుందని.. దీనిపై కూడా విపక్ష నేతలు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ ఏదో గుడినో, మసీదునో, చర్చి​నో కూలగొట్టినట్లు విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం సభకు వేలాదిగా జనం హాజరవుతారని.. ఈ నేపథ్యంలోనే సభా ప్రాంగణంలో కొంత అడ్డంగా ఉన్న కళాశాల నిర్మాణాన్ని తొలగించామన్నారు. మళ్లీ కట్టిస్తామని చెప్పినట్లు వివరించిన మంత్రి.. దానికే సామాజిక మాధ్యమాల్లో విపక్షాలు ఇష్టారీతిన మాట్లాడుతున్నాయని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.