మల్కాజ్​గిరి లోక్​సభ స్థానం నుంచి పోటీకి రెడీ - ఆరు గ్యారంటీలపై ప్రజల్లో అనుమానం : మల్లారెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 5:27 PM IST

thumbnail

Ex Minister Mallareddy Press Meet at Medchal : పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్​లోని పార్టీ ఆఫీసులో పీర్జాదిగూడ నగర మేయర్​ జక్కా వెంకట్​ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలపై విమర్శలు చేశారు.

Mallareddy About on Lok abha Election 2024 : రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఆరు గ్యారంటీలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఆరు పథకాలు ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం ఎవరికి సీటు ఇస్తే వాళ్లే పోటీ చేస్తారని, తనకు టికెట్​ ఇచ్చిన పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనపై పోటీ చేసిన ఓడిపోయిన కాంగ్రెస్​ అభ్యర్థి గెలిచిన వారిలా తిరుగుతూ మేడ్చల్​ నియోజకవర్గం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.