బ్రేకులు ఫెయిల్, పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - తప్పిన పెను ప్రమాదం

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 6:58 PM IST

thumbnail

Bus Accident due to Brake Fail in Vikarabad : బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా బ్రేక్స్​ పని చేయలేదు. దీంతో డ్రైవర్​ కంట్రోల్​ చేయాలని ప్రయత్నించాడు. చివరికి అది అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వికారాబాద్​ జిల్లాలో జరిగింది. 

RTC Bus Accident at Ananthagiri : తాండూరు​ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాాబాద్​ నుంచి తాండూరుకు బయల్దేరింది. వికారాబాద్​లో అనంతగిరి ఘాట్​ రోడ్ వచ్చే సమయానికి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు 108కు, పోలీసులకు తెలియజేశారు. వెంటనే క్షతగాత్రులను వికారాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. పోలీసులు ప్రయాణికులను, డ్రైవర్​ను విచారించి బస్సు బ్రేక్స్​ ఫెయిల్​ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించుకున్నారు. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడం, డ్రైవర్ అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.