అధికారంలో వచ్చాక అసైన్డ్​ భూములున్న వారికి పట్టాలిస్తాం : కేటీఆర్​

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 8:03 PM IST

thumbnail

BRS Election Campaign In Kamareddy : కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీజేపీకే లబ్ది చేకూరుస్తుందని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ వెల్లడించారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి కామారెడ్డి, నిజామాబాద్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామారెడ్డికి కేసీఆర్​ వస్తున్నారంటే నడిసొచ్చే కాలానికి కలిసొచ్చే కొడుకు వస్తున్నడని కేటీఆర్​ అన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకే కేసీఆర్‌ వస్తున్నారని.. మంత్రి పేర్కొన్నారు.

Minister KTR Fires On BJP : బిక్కునూరు మండల కేంద్రంలో కేటీఆర్​ మాట్లాడుతూ.. తాము  అధికారంలోకి వస్తే.. ఒక సెంట్​ భూమి కూడా ఇతరుల చేతిలోకి పోదని ఆయన​ హామీ ఇచ్చారు. డిసెంబర్‌లో అధికారం చేపట్టిన తర్వాత అసైన్డ్ భూములున్న వారికి పట్టాలిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. బీజేపీతో తామెన్నడు పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేసిన కేటీఆర్​.. గోషామహల్‌, కరీంనగర్‌, కోరుట్లలో కాంగ్రెస్‌ కావాలనే డమ్మీ అభ్యర్థులను పెట్టిందని విమర్శించారు. మైనార్టీల సంక్షేమం కోసం దేశంలోనే ఎక్కువగా ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్​ఎస్​ నని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.