Aerial View of Ganesh Idol Immersion : ట్యాంక్​బండ్​ వద్ద గణేశ్​ నిమజ్జనం ఏరియల్​ వ్యూ

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 4:56 PM IST

thumbnail

Aerial View of Ganesh Idol Immersion in Hyderabad : హైదరాబాద్​ నగరంలో జరిగే గణేశ్​ నిమజ్జన కార్యక్రమాన్ని ఏరియల్​ వ్యూ ద్వారా మంత్రులు పరిశీలించారు. ఏరియల్​ వ్యూ ద్వారా మంత్రులు తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మహమూద్​ అలీ.. డీజీపీ అంజనీ కుమార్​ హుస్సేన్​ సాగర్​ పరిసర ప్రాంతాలను గగనం నుంచి వీక్షించారు. 

ట్యాంక్​బండ్​ దగ్గర హుస్సేన్​సాగర్​కు లంబోదరుడు తరలి వచ్చే మార్గాలలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. సాయంత్రానికి ఆ ప్రాంతం మొత్తం గణేశ్​ నిమజ్జనానికి వచ్చే భక్తులతో కోలాహలంగా మారనుంది. దీంతో మంత్రులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి.. వంటి విషయాలను ఏరియల్​ వ్యూ ద్వారా తెలుసుకున్నారు. అంతకు ముందు ఖైరతాబాద్​ బడా గణేశుడి శోభాయాత్ర ఎంతో ఘనంగా జరిగింది. ఖైరతాబాద్​ నుంచి హుస్సేన్​ సాగర్​ వరకు గణపతిబప్ప మోరియా నామస్మరణ మార్మోగిపోయింది. అత్యధిక మొత్తంలో జనసమూహం ఈ యాత్రలో విశేషంగా పాల్గొన్నారు. అనంతరం ఖైరతాబాద్​ మహాగణపతిని హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.