బస్సులో నుంచి జారి పడి మహిళ మృతి

By

Published : Oct 21, 2021, 5:50 PM IST

thumbnail

కదులుతున్న బస్సులో నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు తెన్​కాశీ జిల్లాలో(Tamil Nadu Tenkasi News) జరిగింది. శంకరన్​కోవిల్ ప్రాంతానికి చెందిన మహేశ్వరి... తన కుమార్తె వివాహం కోసం షాపింగ్ చేసేందుకు సమీప పట్టణానికి వెళ్లి, ఓ మినీ బస్సులో తిరిగివస్తోంది. తన స్టాప్​లో దిగేందుకు సిద్ధమవుతుండగా.. బస్సు డ్రైవర్​ ఆకస్మాత్తుగా బ్రేక్​ వేశాడు. దీంతో బస్సులో నుంచి మహేశ్వరి కిందపడింది. తీవ్రంగా గాయపడ్డ మహేశ్వరిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మృతి చెందింది. బస్సు యజమాని, డ్రైవర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.