ETV Bharat / state

సర్వాంగ సుందరంగా ముస్తాబైన యాదాద్రి సన్నిధి

author img

By

Published : Dec 24, 2020, 7:57 PM IST

vaikunta ekadashi arrangements are completed in yadadri
సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోన్న నారసింహుని సన్నిధి

ముక్కోటి ఏకాదశి వేడుకలకు యాదాద్రి నారసింహుని ఆలయం ముస్తాబైంది. భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. కరోనా నిబంధనల దృష్ట్యా భక్తులు మాస్కులు ధరించి ఆలయానికి రావాలని కోరారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ముక్కోటి ఏకాదశి వేడుకలకు సిద్ధమవుతోంది. భక్తులకు శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. ఉదయం 6.43 గంటల నుంచి 9:30 గంటల వరకు మాత్రమే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. కొవిడ్ దృష్ట్యా యాత్రికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

6రోజుల పాటు అధ్యయనోత్సవాలు

ఆలయంలో శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయని ఈఓ వెల్లడించారు. ఈ ఆరు రోజుల్లో నిత్య కళ్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాలు తాత్కాలికంగా రద్దు పరిచినట్లు ప్రకటించారు. ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి నిత్య ఆరాధనలు చేపడతామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కన్నులపండువగా భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.