ETV Bharat / state

Warangal CP on Allegations Police Beating to KU Students : కేయూ విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారనేది అవాస్తవం : సీపీ రంగనాథ్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 10:03 PM IST

Updated : Sep 7, 2023, 10:09 PM IST

police beating of students
Kakatiya University Latest News

Warangal CP on Allegations Police Beating to KU Students : కాకతీయ విశ్వవిద్యాలయంలో పోలీసుల దాడి చేశారంటూ విద్యార్థిసంఘాలు నిరసన చేపట్టాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు.. విద్యార్థుల ఆందోళనకు మద్దతిచ్చారు. పీహెచ్‌డీ ప్రవేశాల్లో అవకతవకలపై ధర్నా చేస్తుంటే.. పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని విద్యార్థులు ఆరోపించారు. నిరసనగా ఈనెల 12 జిల్లా బంద్‌కి పిలుపునిచ్చాయి. విద్యార్థులెవరిని కొట్టలేదని పోలీస్ కమిషనర్ రంగనాథ్‌ వెల్లడించారు.

Warangal CP on Allegations Police Beating to KU Students యూ విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారనేది అవాస్తవం

Warangal CP on Allegations Police Beating to KU Students : కాకతీయ విశ్వవిద్యాలయంలో.. పీహెచ్‌డీ కేటగిరి- 2లో ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని విద్యార్థులు చేపట్టిన ఆందోళన.. తదనంతర పరిణామాలు కలకలం రేపాయి. ప్రవేశాలు రద్దు చేయాలంటూ విద్యార్థులు ప్రిన్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుపోగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో(students Clash With Police).. విద్యార్థులకు గాయాలయ్యాయి. కార్యాలయ ఫర్నీచర్ ధ్వంసమైంది.

కస్టడీ సమయంలో పోలీసులు విచక్షణరహితంగా కొట్టారని విద్యార్థులు ఆరోపించగా.. వారిని వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకి తరలించారు. బుధవారం అర్ధరాత్రి న్యాయమూర్తి నివాసంలో వారిని హాజరుపరచగా 8 మందికి బెయిల్ మంజూరైంది. ఇద్దరికి బెయిల్‌ నిరాకరించడంతో వారిని జైలుకు తరలించారు. పోలీసుల దాడిని నిరసిస్తూ 12 విద్యార్థి సంఘాలు.. కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం ఎదుట దీక్షకు దిగాయి. దీనికి రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దాడిని నిరసిస్తూ ఈనెల12 జిల్లా బంద్‌కి విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది.

Telangana University : టీయూ పరిస్థితేంటి?.. వీసీ జైలుకెళ్లడంతో అనుమతులకు ఇబ్బందులు

Etela Rajender Respond Police Beating of Students : కేయూ విద్యార్థులను పోలీసులు కొట్టిన తీరు బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తీసుకెళ్లి కొట్టడం దేశచరిత్రలో తెలంగాణలో జరిగిందని మండిపడ్డారు. వారిని కొట్టిన తీరు చూసి న్యాయమూర్తే ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. విద్యార్థులను ఇంత దారుణంగా కొట్టించిన ఘనత కేసీఆర్‌ సర్కార్‌దేనని విమర్శించారు. వారి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

"కేయూ విద్యార్థులను పోలీసులు కొట్టిన తీరు బాధాకరం. విద్యార్థులను టాస్క్‌ఫోర్స్‌ వాళ్లు తీసుకెళ్లి కొట్టడం దేశ చరిత్రలో తెలంగాణలో జరిగింది. విద్యార్థులను కొట్టిన తీరు చూసి జడ్జి ఆశ్చర్యపోయారు. కేయూ విద్యార్థులను వీసీ కొట్టించిన తీరును దేశం మొత్తం గమనిస్తోంది. విద్యార్థులను ఇంత తీవ్రంగా కొట్టించిన ఘనత కేసీఆర్‌ సర్కార్‌దే. విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది." - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే

Warangal CP on KU Students : తోపులాటల్లో జరిగిన గాయాలు తప్ప.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు విద్యార్థులను కొట్టలేదని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. నెల రోజుల క్రితం జరిగిన గాయాలకు కట్టుకట్టి పెద్దదిగా చూపిస్తున్నారని విమర్శించారు. తాను ఎవరిని తుపాకీతో బెదరించలేదన్న ఆయన.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరగలేదని ప్రతిభ ఆధారంగానే సీట్ల కేటాయింపు జరిగిందని యూనివర్సిటీ వీసీ రమేశ్‌ తెలిపారు. కేయూ పీహెచ్‌డీ ప్రవేశాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కేయూలో సభకు నిరాకరించిన వీసీ.. భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

"కేయూ విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారనేది అవాస్తవం. ఒక విద్యార్థికి మాత్రమే చిన్న ఫ్రాక్చర్ అయింది. ప్రశాంత్‌ అనే విద్యార్థికి అయిన ఫ్రాక్చర్‌ కూడా నెలక్రితం జరిగింది. అనుమానం ఉంటే విద్యార్థులకు మరెక్కడైనా టెస్టులు చేయించవచ్చు. లేని గాయాలకు విద్యార్థులు కట్లు కట్టుకున్నారు. పీఎస్‌కు తరలిస్తున్నప్పుడు కమిలిన గాయాలే తప్ప.. కొట్టిన దెబ్బలు కావు. విద్యార్థులంటే మా పిల్లల వలే చూసుకుంటాం. కేసులు పెట్టి విద్యార్థుల జీవితాలు నాశనం చేసే నిర్ణయం తీసుకోం." - రంగనాథ్, వరంగల్ సీపీ

పీహెచ్‌డీ ప్రవేశాల రగడ, ఓయూలో ర్యాంకుల విధానంపై వ్యతిరేకత

ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాలకు కొత్త నిబంధనలు

Last Updated :Sep 7, 2023, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.