ETV Bharat / state

ధాన్యం తరలింపునకు లారీలు లేక రైతుల ఇబ్బందులు

author img

By

Published : Jun 2, 2020, 3:41 PM IST

warangal rural farmers protest demanding lorries to move grain
ధాన్యం తరలింపునకు లారీలు లేక రైతుల ఇబ్బందులు

వరంగల్​ గ్రామీణ జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాలంగా వర్షాలు కురుస్తుండటం వల్ల ఆరుగాలం పడిన కష్టమంతా వృథా అవుతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

వరంగల్​ గ్రామీణ జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తరలించడానికి లారీలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీల్లో లోడ్ చేయడం, మిల్లర్ల వద్ద అన్​లోడ్​ చేయడం పూర్తిగా తమ మీదే భారం పడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము అరిగోస పడుతున్నామని కర్షకులు వాపోయారు. లారీ అసోసియేషన్​లతో మాట్లాడి సరిపడా లారీలు పంపించాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.