ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డి మృతికి ప్రభుత్వమే భాద్యత వహించాలని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్లానే శ్రీనివాసరెడ్డి మృతి చెందాడన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మెకు కోదండరామ్ సంఘీభావం తెలిపారు. రేపటి నుంచి విధులకు రావొద్దంటె ఆర్టీసీ కార్మికులేం ఫాంహౌజ్లో పాలేర్లు కాదని విమర్శించారు. ఈ సమ్మె తెలంగాణలో ఉన్న రుగ్మతలకు, నిరంకుశ పాలనకు పరిష్కారం చూపుతుందన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధన కోసం జరుగుతున్న పోరాటంలో విజయం తథ్యమని ఎవరూ అధైర్య పడవద్దని కోదండరామ్ సూచించారు.
ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."