ETV Bharat / state

Bandi sanjay Comments On CM KCR : 'కేసీఆర్​ మళ్లీ అధికారంలోకి వస్తే.. రూ.10 లక్షల కోట్ల అప్పు'

author img

By

Published : Jun 29, 2023, 10:41 PM IST

Updated : Jun 29, 2023, 10:56 PM IST

Bandi sanjay
Bandi sanjay

Bandi Sanjay Says BJP Govt Will Formed In Telangana : రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్​ అధికారంలోకి వస్తే.. రూ.10 లక్షల కోట్లు అప్పు చేయడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా వనపర్తిలో కాషాయ జెండా ఎగురవేయనుందని ధీమా వ్యక్తం చేశారు. వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని.. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Bandi Sanjay Comments On BRS And Congress : వనపర్తిలో జిల్లా మక్తల్​లో రాబోయే ఎన్నికల్లో.. బీజేపీ గెలుస్తుందనే సర్వేలన్నీ చెబుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో.. పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహా జన సంపర్క్​ అభియాన్​ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఆత్మకూరులోని మక్తల్​లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ మహా జన్​ సంపర్క్​ అభియాన్​ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో.. తెలంగాణ బీజేపీ 119 బహిరంగ సభలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ బహిరంగ సభలో బండి సంజయ్​ .. కేసీఆర్​, కాంగ్రెస్​ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్​ యోజన పథకం కింద.. తెలంగాణకు 2.40 లక్షల ఇళ్లను మంజూరు చేసే.. మక్కల్​లో ఒక్కరికైనా డబుల్​ బెడ్​రూం ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా అని బండి సంజయ్​ అక్కడి ప్రజలను అడిగారు. ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. నేడు ఎవరికైనా ఇచ్చిందానని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్..​ ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో చెప్పాలని సభావేదికపై ధ్వజమెత్తారు.

Bandi Sanjay Fire On CM KCR : అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఒక్కో ఎకరానికి రూ.10,000 ఇస్తానని ఆనాడు సీఎం కేసీఆర్ మూడు జిల్లాల పర్యటన చెప్పారు కదా.. నేడు ఆ పరిహారాన్ని ఇచ్చారా అని రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్​ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆత్మకూరును రెవెన్యూ డివిజన్​ చేస్తానని చెప్పిన సీఎం.. ఇప్పటివరకు ఎందుకు ఆ పని చేయలేదన్నారు. ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి.. రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. కేసీఆర్​ ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నేరవేర్చారని.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో చూపించాలని సవాల్​ విసిరారు.

"రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్​ అధికారంలోకి వస్తే.. రూ.5 లక్షల కోట్ల అప్పు కాస్త.. రూ.10 లక్షల కోట్లు అవుతుంది. కేసీఆర్​ ఇచ్చిన హామీలు ఎన్ని.. వాటిలో ఎన్ని నేరవేర్చారో చెప్పాలి. ఆత్మకూరును రెవెన్యూ డివిజన్​ చేస్తానని చెప్పిన కేసీఆర్​.. ఆ పని చేశారా?" -బండి సంజయ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

BJP Maha Jan Sampark Abhiyan : కేసీఆర్​ మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న రూ.5 లక్షల కోట్ల అప్పు.. రూ.10 లక్షల కోట్లు అవుతుందని బండి సంజయ్​ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పండే ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వమే కొంటోందని.. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజానికం గుర్తించుకోవాలని బండి సంజయ్​ కోరారు. కేసీఆర్​ అవినీతి చేయకపోతే.. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్​ అంటే కిరాణ దుకాణం.. బీఆర్​ఎస్​కు షాపింగ్​ మాల్​ అని అన్నారు. ఎప్పుడంటే అప్పుడు కాంగ్రెస్​ నుంచి ఎమ్మెల్యేలను కొనే విధంగా.. అంతా సిద్ధం చేసుకొనే బీఆర్​ఎస్​ ఉంటుందని ధ్వజమెత్తారు.

కేసీఆర్​ మళ్లీ అధికారంలోకి వస్తే.. రూ.10 లక్షల కోట్ల అప్పు

ఇవీ చదవండి :

Last Updated :Jun 29, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.