ETV Bharat / state

గెలిపిస్తే పరిగిని అభివృద్ధి చేస్తా: రంజిత్ రెడ్డి

author img

By

Published : Mar 28, 2019, 8:23 PM IST

కేంద్రానికి సానుకూలంగా ఉన్న రాష్ట్రాలకే నిధులు మంజూరు చేస్తున్నారు : రంజిత్ రెడ్డి

నా తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నన్ను గెలిపించండి.. ఎమ్మెల్యేతో కలిసి తప్పకుండా పరిగిని అభివృద్ధి బాట పట్టిస్తా ---- చేవేళ్ల లోక్​సభ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి

చేవెళ్ల లోక్​సభపరిధిలోని పరిగి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెరాస అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తన తల్లిపై ప్రమాణం చేశారు. వికారాబాద్ జిల్లా దోమ మండలంలో నిర్వహించినకార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సీఎం ప్రవేశపెట్టినపథకాలు ప్రజలకు లబ్ధి చేకూర్చాయని వెల్లడించారు.అందుకే కేసీఆర్​ను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. కేంద్రానికి సానుకూలంగా ఉన్న రాష్ట్రాలకే నిధులు మంజూరు చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే 16 స్థానాలు గెలవాలని అన్నారు. తననిభారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.

నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా : రంజిత్ రెడ్డి

ఇవీ చూడండి :టెంట్​హౌస్​లో అగ్నిప్రమాదం.. 20 లక్షల ఆస్తి నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.