ప్రజలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. అధికారుల అట్రాసిటీ కేసుల పరిహారం ప్రత్యేక శ్రద్ధ వహించి బాధితులకు తక్షణమే పరిహారం అందేలా చేయాలని కోరారు.
సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న పరిహారం కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగదేవపూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన కేసు పరిహారం మూడ్రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీ ఎస్టీ, గిరిజన ప్రజలకు అండగా ఉండటమే గాక ప్రభుత్వ సంక్షేమ పథఖాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చేస్తోందని వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి