పెళ్లి చేసుకోవడానికి ముందు అనేక విధాలుగా ఆలోచించి ప్రతి విషయంలో ఆచితూచి అడుగు ముందుకు వేస్తున్న కాలం ఇది. సిద్దిపేటకు చెందిన చిదురాల విద్యాసాగర్(25) ఇవేవి పట్టించుకోలేదు. హైదరాబాద్కు చెందిన రవళి(22) అనే మూడు అడుగుల రెండు అంగుళాలున్న మరుగుజ్జును పెళ్లి చేసుకున్నాడు. ముషీరాబాద్లోని హైటెక్ ఫంక్షన్ హాల్ దీనికి వేదికైంది.
హైదరాబాద్లోని మహంకాళి ప్రాంతానికి చెందిన వీరవల్లి శ్రీనివాస్, పద్మ దంపతులకు ఇద్దరు సంతానం... కూతురు రవళి పుట్టుక నుంచే మరుగుజ్జు. స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. దూరపు బంధువైన రవళిని విద్యాసాగర్కు ఇచ్చి పరిణయం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అంతే కాకుండా అబ్బాయి ఇల్లరికానికి సైతం అంగీకరించాడు.
ఇష్టాలకు సంబంధించిన విషయం
ఇది ఇద్దరి ఇష్టాలకు సంబంధించిన విషయమని... ఎత్తుతో ఏం సంబంధమని అంటున్నారు విద్యాసాగర్. మరుగుజ్జును వివాహమాడటంలో ఎలాంటి నిరాశలేదని ఆయన అంటున్నారు.
తన లోపాలను ఎత్తి చూపకుండా ఎంతో ఆదర్శంగా తనని పెళ్లి చేసుకోవడాన్ని రవళి ఆనందంతో ఆహ్వానించారు.
ఇవీ చదవండి:నేడు సీఎల్పీ సమావేశం