ETV Bharat / state

Minister Harish Rao: 'కేసీఆర్​కు గజ్వేల్ నుంచే పోటీ చేయాలని చెబుతా'

author img

By

Published : Apr 21, 2023, 10:26 PM IST

Minister Harish Rao
Minister Harish Rao

Minister Harish Rao at Gajwel BRS Athmiya Sammelanam: గజ్వేల్ అభివృద్ధి గజమాల లాంటిదని.. గుండె మీద చేయివేసుకుని గజ్వేల్‌ను అభివృద్ధి చేశామని చెప్పగలమని మంత్రి హరీశ్​రావు ధీమా వ్యక్తం చేశారు. ఎవరైనా గజ్వేల్​కు ఏం చేశారని అడిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూపించండని అన్నారు. 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని కేవలం 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపారని తెలిపారు.

'కేసీఆర్​కు గజ్వేల్ నుంచే పోటీ చేయాలని చెబుతా'

Minister Harish Rao at Gajwel BRS Athmiya Sammelanam: తాను తెలంగాణ రాకముందు సిద్ధిపేటలో ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆ నాడు రైతులు, చేనేత కార్మికులు చనిపోతే పక్క రాష్ట్రాల నుంచి విలేకరులు వచ్చి వార్తలు రాసేవారని మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన మంత్రి.. 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని కేవలం 6 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపారని తెలిపారు. గతంలో గణేశ్ నిమర్జనాలు, బతుకమ్మ పండుగలు వస్తే ఏ చెరువులో వేయాలో తెలియక ప్రజలు గందరగోళానికి గురయ్యేవారని అన్నారు.

గతుకులున్న గజ్వేల్​ను బతుకుల నిలయంగా: సీఎం కేసీఆర్ గజ్వేల్​కు వచ్చాక రింగు రోడ్డు, పార్కులు, రైల్వేస్టేషన్, డ్యాములు తెచ్చారని హరీశ్ రావు తెలిపారు. గతుకులుగా ఉన్న గజ్వేల్​ను బతుకుల నిలయంగా మార్చింది కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ రాకముందు ఇక్కడ యాసంగిలో 7 వేల ఎకరాల సాగు చేసేవారని.. ఇప్పుడు 17 వేల ఎకరాలను సాగు చేస్తున్నారని వెల్లడించారు. 60 ఏళ్లు వెనుక ఉన్న ఈ ప్రాంతాన్ని 60 ఏళ్లు ముందుకు తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్రంలో తనకు తెలిసి పార్టీలను రెండు పర్యాయాలు నిలబెట్టిన వారు ఇద్దరే ఇద్దరని వారు.. ఒకరు ఎన్టీఆర్ మరొకరు కేసీఆరే అని తెలిపారు.

నిజాలను ఎప్పుడూ ప్రజల ముందు పెట్టాలి: రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందనిని హరీశ్ రావు ఆరోపించారు. దేశంలో మార్పు కోసం సీఎం కేసీఆర్ బయల్దేరారని.. తమ నినాదం రైతు నినాదమని స్పష్టం చేశారు. నిజాలను ఎప్పుడూ ప్రజల ముందు పెట్టాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పారని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను కార్యకర్తలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్​కు గజ్వేల్ నుంచి పోటీ చేయాలని చెబుతా: ముఖ్యమంత్రి కేసీఆర్​ను తమ జిల్లా నుంచి పోటీ చేయించాలని నాలుగైదు జిల్లాల నాయకులు తనను కోరుతున్నారని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ తమ జిల్లా నుంచి పోటీ చేస్తే తాము బాగుపడతామని తనను కోరుతున్నారని మీరేమంటారో చెప్పాలంటూ.. మంత్రి హరీశ్​రావు అనడంతో కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేయాలని కార్యకర్తలంతా మద్దతు పలికారు. వారి మాటగా తాను కేసీఆర్​కు గజ్వేల్ నుంచి పోటీ చేయాలని చెబుతానని అన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కేసీఆర్ నిర్ణయమేనని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.