ETV Bharat / state

ప్రేయసికి పెళ్లి.. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

author img

By

Published : Feb 13, 2020, 5:49 PM IST

young boy committed suicide on railway track
ప్రేయసికి పెళ్లి.. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ప్రేయసికి వేరే వ్యక్తితో వివాహం జరుగుతుండడం వల్ల మనస్తాపానికి గురై షాద్​నగర్​లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందే ఓ యువకుడు తనువు చాలించాడు. ప్రేయసి తనకు దక్కదనే మనస్తాపంతో రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కొందుర్గ్​కు చెందిన విజయ్ ఓ చాక్లెట్​ పరిశ్రమలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. గురువారం.. విజయ్​ ప్రేమించిన యువతి పెళ్లి వేరే వ్యక్తితో జరుగుతుండం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కూడా పనికి వెళ్లకుండా షాద్​నగర్​లోనే విజయ్​ గడిపినట్లు తల్లిదండ్రులు తెలిపారు. మృతుడు తండ్రి కృష్ణయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీచూడండి: తమ్ముడు చనిపోయిన కొద్ది గంటల్లోనే అన్న మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.