ETV Bharat / state

అంతరాష్ట్ర గంజాయి​ ముఠా అరెస్టు - రాష్ట్రాన్ని డ్రగ్స్​ రహిత దిశగా చర్యలు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 5:12 PM IST

Updated : Dec 18, 2023, 5:23 PM IST

Police Arrested Drug Gang in Hyderabad : న్యూఇయర్​ సమీపిస్తున్న వేళ పోలీసులు డ్రగ్స్​పై నిఘా పెట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు కట్టుదిట్టమైన చర్యలపై అధికారయంత్రాంగం దృష్టిసారించింది. తాజాగా రాచకొండ పరిధిలో ఓ అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Rachakonda CP Interview over Drugs
Police Arrested Drug Gang in Hyderabad

Police Arrested Drug Gang in Hyderabad : నూతన సంవత్సర వేడుకలపై రాచకొండ పోలీసులు దృష్టి సారించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మాదక ద్రవ్యాల సరఫరాకు పథకం వేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్​ సుధీర్‌బాబు(Police Commissioner Sudheer Babu) వెల్లడించారు. వీరి నుంచి ఓపీయం డ్రగ్స్‌ 3.4 కిలోలు, 45 గ్రాముల పాపి స్ట్రాప్‌ పౌడర్‌తో పాటు 2.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. ఈ కేసులో శశిపాల్‌ బిశ్​ నాయ్‌, మదనలాల్‌ బిశ్​బాయ్‌లను అరెస్టు చేశామని పేర్కొన్నారు. వీరు రాజస్థాన్​కు చెందిన వారని, నగరంలో ఓ ముఠా ద్వారా డ్రగ్స్​ సరఫరా చేస్తున్నారని చెప్పారు.

Rachakonda CP Interview over Drugs : గతంలో కూడా ఒకసారి శశిపాల్‌ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారని సీపీ సుధీర్​ బాబు తెలిపారు. నిందితులు ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాలను తీసుకువస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనరేట్‌లో డ్రగ్స్‌ను నిర్మూలించడానికి స్పెషల్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఫాంహౌస్​లు, రిసార్ట్స్,(Resorts) పబ్‌లపై నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు.

బీఆర్​ఎస్​ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందన్న సీఎం రేవంత్​ - ఖండించిన కేటీఆర్​

Awareness for Drug Free in Telangana : ఇప్పటి వరకూ లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలు(Drugs) స్వాధీనం చేసుకున్నామని సుధీర్​ బాబు తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారని, దీనిపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం డ్రగ్స్​ రహిత రాష్ట్రంగా చేస్తామని అన్నారు.

'డ్రగ్స్​ విక్రయాలు ఎక్కడ జరుగుతాయి, ఏ ప్రదేశాల్లో డగ్స్​ను ఉపయోగిస్తారు, ఏ వ్యక్తులు ఇటువంటి కేసుల్లో నిందితులుగా ఉన్నారనే వాటిపై మా దగ్గర సమాచారం ఉంది. దాని ఆధారంగా కసరత్తు చేస్తున్నాం. రాష్ట్రంలో డ్రగ్స్​ రహితం(Drug Free state) చేస్తాం. ఇతర రాష్ట్రాలకు కూడా డ్రగ్స్​ను సరఫరా చేయాలంటే రాష్ట్ర రహదారిపై (State Highway)నుంచే పోవాలి. అందువల్ల ఇప్పటి వరకు డ్రగ్స్​ ముఠాను పట్టుకుని వాటిని చాలా వరకు సీజ్​ చేశాం. మొన్న కూడా ఓఆర్​ఆర్​ దగ్గర 360 కేజీల గంజాను సీజ్​ చేశాం' - సుధీర్‌బాబు, రాచకొండ పోలీసు కమిషనర్.

Anti Drug campaign : కేవలం కమిషనరేట్​ పరిధిలో కాకుండా రాష్ట్రంలో ఉన్నతాధికారులందరూ డ్రగ్స్​ సరఫరాపై చర్యలు తీసుకుంటున్నారని సీపీ సుధీర్​ బాబు తెలిపారు. దీంతో డ్రగ్స్​ రహిత రాష్ట్రంగా మారే అవకాశం ఉంటుందని అన్నారు.

అంతరాష్ట్ర గంజాయి​ ముఠా అరెస్టు - రాష్ట్రాన్ని డ్రగ్స్​ రహిత దిశగా చర్యలు

Tollywood Drugs Case Update : టాలీవుడ్‌లో మరోసారి మత్తు కలకలం!.. నిందితుల్లో సినీ దర్శకుడు, మాజీ ఎంపీ కుమారుడు

Maharashtra Drugs Case : నదిలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్.. అర్ధరాత్రి ఆపరేషన్.. సీజ్ చేసిన పోలీసులు

Last Updated : Dec 18, 2023, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.