ETV Bharat / state

సచివాలయంలో సీఎం వరుస సమీక్షలు - రైతుబంధు నిధుల విడుదల, డ్రగ్స్ నియంత్రణకు ఆదేశాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 8:16 PM IST

Updated : Dec 11, 2023, 9:52 PM IST

CM Revanth Reddy Review on Rythu Bharosa Scheme : తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ, వడివడిగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వరుస సమీక్షలతో సచివాలయంలో తీరిక లేకుండా గడుపుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై ఉన్నతాధికారులు, సహచర మంత్రులతో భేటీ అయి సమాలోచనలు చేస్తున్నారు. అదేవిధంగా రైతుబంధు, పలు అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy on Drugs
CM Revanth Reddy Review on Rythu Bharosa Scheme

CM Revanth Reddy Review on Rythu Bharosa Scheme : వరుస సమీక్షలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్‌ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు తక్షణం ప్రారంభించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ట్రెజరీలో(Treasury) ఉన్న నిధులు విడదల చేయాలని నిర్దేశించారు

రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభం

రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కానందున.. గతంలో మాదిరి రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలని ఆదేశించారు. అర్హులైన అన్నదాతల ఖాతాల్లో తక్షణం జమ అయ్యేలా చూడాలని రైతుభరోసాపై సచివాలయంలో జరిపిన సమీక్షాసమావేశంలో యంత్రాంగానికి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు(Agriculture Officials) పాల్గొన్నారు. రైతుభరోసా సొమ్ము వెంటనే రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చెల్లింపులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి - అసెంబ్లీలో దడదడలాడించడమే కాదు - కిచెన్​లో ఘుమఘుమలాడించడమూ తెలుసు

సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ఆబ్కారీ శాఖ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ అధికారులు(Excise Department Officials) పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఎస్​పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్ల సమాచారంపై ఆరాతీశారు. అంతకుముందు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు.

CM Revanth Reddy on Drugs : సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, హెచ్ న్యూ అదనపు డీజీ సీవీఆనంద్, సీఐడీ అదనపు డీజీ మహేష్ భగవత్, పోలీసు అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిపై యత్రాంగంతో సమాలోచనలు చేశారు. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌(Heroin) సరఫరాను నియంత్రించి వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.

డ్రగ్స్‌ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్‌ అన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమిస్తామని సీఎం ప్రకటించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో(Anti Narcotic Bureau) విభాగాన్ని బలోపేతం చేయాలని, డ్రగ్స్‌ చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి : సీతక్క

Minister Sridhar Babu on Prajadarbar : మరోవైపు ఇవాళ ప్రజాభవన్​లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం అందరికీ న్యాయంచేస్తుందని తెలిపారు. ప్రజాదర్బార్‌కి వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకొని, వారి నుంచి వినతులను స్వీకరించారు. దరఖాస్తులపై పూర్తి చిరునామా, సెల్‌ఫోన్ నంబర్, వివరాలు రాయాలని సూచించారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వం పనిచేస్తుందన్న శ్రీధర్‌బాబు, ఈ నెల17న నిర్వహించనున్న టీఎస్​జెన్‌కో(TSGENCO) ఏఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని తెలిపారు.

Congress Govt Governance in Telangana : ఆ రోజు రెండు, మూడు పరీక్షలున్నట్లు అభ్యర్థులు వివరించగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గౌరవవేతనాన్ని ప్రతినెలా అందేలాచూడాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు మంత్రికి విజ్ఞాపనపత్రం అందించారు. ఈనెల 8న ప్రారంభించిన ప్రజాదర్బార్‌లో ఇప్పటివరకు 4,471 వరకు వినతి పత్రాలు(Petition Documents) ప్రభుత్వానికి అందినట్లు అధికారులు తెలిపారు. అందులో ఎక్కువ శాతం రెండు పడకలగదుల ఇళ్లు, వివిధ రకాల పింఛన్లు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని వివరించాయి.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని కార్యకర్తలకు మంత్రి పొన్నం పిలుపు

పిలిస్తే పలుకుతా - ఒక్క పిలుపుతో స్పందించి సమస్య పరిష్కరించిన సీఎం

CM Revanth Reddy Review on Rythu Bharosa Scheme : వరుస సమీక్షలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్‌ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు తక్షణం ప్రారంభించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ట్రెజరీలో(Treasury) ఉన్న నిధులు విడదల చేయాలని నిర్దేశించారు

రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభం

రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కానందున.. గతంలో మాదిరి రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలని ఆదేశించారు. అర్హులైన అన్నదాతల ఖాతాల్లో తక్షణం జమ అయ్యేలా చూడాలని రైతుభరోసాపై సచివాలయంలో జరిపిన సమీక్షాసమావేశంలో యంత్రాంగానికి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు(Agriculture Officials) పాల్గొన్నారు. రైతుభరోసా సొమ్ము వెంటనే రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చెల్లింపులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి - అసెంబ్లీలో దడదడలాడించడమే కాదు - కిచెన్​లో ఘుమఘుమలాడించడమూ తెలుసు

సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ఆబ్కారీ శాఖ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ అధికారులు(Excise Department Officials) పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఎస్​పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్ల సమాచారంపై ఆరాతీశారు. అంతకుముందు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు.

CM Revanth Reddy on Drugs : సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, హెచ్ న్యూ అదనపు డీజీ సీవీఆనంద్, సీఐడీ అదనపు డీజీ మహేష్ భగవత్, పోలీసు అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిపై యత్రాంగంతో సమాలోచనలు చేశారు. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌(Heroin) సరఫరాను నియంత్రించి వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.

డ్రగ్స్‌ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్‌ అన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమిస్తామని సీఎం ప్రకటించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో(Anti Narcotic Bureau) విభాగాన్ని బలోపేతం చేయాలని, డ్రగ్స్‌ చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి : సీతక్క

Minister Sridhar Babu on Prajadarbar : మరోవైపు ఇవాళ ప్రజాభవన్​లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం అందరికీ న్యాయంచేస్తుందని తెలిపారు. ప్రజాదర్బార్‌కి వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకొని, వారి నుంచి వినతులను స్వీకరించారు. దరఖాస్తులపై పూర్తి చిరునామా, సెల్‌ఫోన్ నంబర్, వివరాలు రాయాలని సూచించారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వం పనిచేస్తుందన్న శ్రీధర్‌బాబు, ఈ నెల17న నిర్వహించనున్న టీఎస్​జెన్‌కో(TSGENCO) ఏఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని తెలిపారు.

Congress Govt Governance in Telangana : ఆ రోజు రెండు, మూడు పరీక్షలున్నట్లు అభ్యర్థులు వివరించగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గౌరవవేతనాన్ని ప్రతినెలా అందేలాచూడాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు మంత్రికి విజ్ఞాపనపత్రం అందించారు. ఈనెల 8న ప్రారంభించిన ప్రజాదర్బార్‌లో ఇప్పటివరకు 4,471 వరకు వినతి పత్రాలు(Petition Documents) ప్రభుత్వానికి అందినట్లు అధికారులు తెలిపారు. అందులో ఎక్కువ శాతం రెండు పడకలగదుల ఇళ్లు, వివిధ రకాల పింఛన్లు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని వివరించాయి.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని కార్యకర్తలకు మంత్రి పొన్నం పిలుపు

పిలిస్తే పలుకుతా - ఒక్క పిలుపుతో స్పందించి సమస్య పరిష్కరించిన సీఎం

Last Updated : Dec 11, 2023, 9:52 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.