ETV Bharat / state

Nanakramguda Woman Murder Case Updates : అప్పటికే వారిద్దరికి వివాహేతర బంధం.. చిన్న గొడవతో ఆమెపై హత్యాచారం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 7:53 AM IST

Gachibowli Woman Murder Case Updates
Nanakramguda Woman Murder Case Updates

Nanakramguda Woman Murder Case Updates : మహిళను బలాత్కారం చేయటమే కాకుండా.. దారుణంగా హతమార్చి బంగ్లాదేశ్‌ సరిహద్దుకు పారిపోయిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో కష్టాల కోర్చి.. కలుగులో దాక్కున్న ఎలుకను బయటికి తెచ్చినట్లుగా అత్యంత చాకచక్యంగా సైబరాబాద్‌ పోలీసులు ఈ హత్య కేసును ఛేదించారు. నిందితుడు దాక్కున్న బంగాల్‌లోని మారుమూల ప్రాంతంలో పరిస్థితులు అనుకూలించకపోయినా.. బాధితులకు న్యాయం చేయటమే లక్ష్యంగా ముందుకు సాగి, కిరాతకుడితో సహా మరో ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు.

Nanakramguda Woman Murder Case Updates : హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో గత నెల 27న మహిళ దారుణ హత్యకు గురైన కేసులో ఓ నిందితుడితో పాటు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 27వ తేదీన కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో గుర్తించిన పోలీసులు.. మృతురాలు గౌలిదొడ్డి కేశవ్‌నగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. అంతకు రెండ్రోజుల ముందు నమోదైన అదృశ్య కేసు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. మృతురాలి వివరాలు గుర్తించారు. అలాగే హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా అదే ప్రాంతంలో కూలీ పనులు చేస్తున్న శ్యామల్‌రాయ్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. శ్యామల్‌రాయ్‌కు ఆమెతో అప్పటికే వివాహేతర బంధం కొనసాగుతుండగా.. 25వ తేదీన సాయంత్రం కలుసుకున్న సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శ్యామల్‌ ఆమెను దారుణంగా హత మార్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

Woman Murder in Nanakramguda : నానక్‌రాంగూడలో మహిళపై అత్యాచారం.. ఆపై హత్య! గవర్నర్, మహిళా కమిషన్ స్పందన

Gachibowli Woman Murder Case Updates : భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న శ్యామల్‌రాయ్.. పశ్చిమ బంగాల్‌ మాల్డా జిల్లా అడదంగాకు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. కూలీలను సమకూర్చే గుత్తేదారు ఇచ్చిన సమాచారం, ఆధార్‌, సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నిందితుడు తన స్వస్థలానికి వెళ్లిపోయినట్లు గుర్తించారు. హత్య కేసు విచారణ కోసం ఏర్పడిన గచ్చిబౌలి పోలీసుల ప్రత్యేక బృందం శ్యామల్‌ కోసం బంగాల్‌కు వెళ్లింది. బంగ్లాదేశ్‌ సరిహద్దున నిందితుడి గ్రామం ఉండటంతో చాకచాక్యంగా.. అతికష్టం మీద శ్యామల్‌రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళను తానే హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు.. ఈ విషయం అశోక్‌ సర్కార్, అలోక్‌ సర్కార్‌ అనే వ్యక్తులకు సైతం తెలుసునని పోలీసులకు వివరించాడు. ఈ మేరకు శ్రీకృష్ణాపూర్‌లో అశోక్ సర్కార్‌ను పట్టుకున్న పోలీసులు.. అలోక్ సర్కార్ కోసం బరింద గ్రామం బయల్దేరారు.

కార్పెంటర్ ఘాతుకం.. యువతి తల నరికి.. శరీరాన్ని ముక్కలు చేసి..

సాహసం చేసి.. నిందితుడిని పట్టుకుని..: అతని గ్రామానికి వెళ్లాలంటే టాంగొన్ నది దాటాల్సి ఉంటుంది. ఇందుకోసం అక్కడి ప్రజలు తెప్పల్లో వెళ్తుంటారు. రాత్రి వేళ అలోక్‌ను పట్టుకునేందుకు నది వద్దకు వెళ్లినా.. తెప్పలో తీసుకువెళ్లే వ్యక్తి సహకరించలేదు. అలోక్‌ను పట్టించేందుకు సహకరిస్తే తనను గ్రామస్థులు ఇబ్బంది పెడతారని చెప్పాడు. దీంతో చేసేదిలేక తెప్పకు ఒకవైపు తాడు కట్టి సాహసోపేతంగా నది ఒడ్డుకు చేరిన పోలీసులు.. ఎట్టకేలకు అలోక్‌ సర్కార్‌ను సైతం అరెస్టు చేశారు. వీరిని అరెస్టు చేసి స్థానిక ఠాణాకు తీసుకెళ్లగా అక్కడి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఎదురైనట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు సైతం ఆందోళనకు దిగినట్లు చెప్పారు. అతి కష్టమ్మీద ముగ్గురిని మాల్డా కోర్టులో హాజరుపర్చి, రాష్ట్రానికి తీసుకొచ్చారని మాదాపూర్‌ డీసీపీ వివరించారు.

Governor Tamilisai Meerpet Gang Rape : మీర్​పేట్​ గ్యాంగ్ రేప్.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. పోలీసులకు గవర్నర్ ఆదేశాలు

ఉన్నతాధికాల అభినందనలు..: మూడ్రోజుల పాటు నిద్రాహారాలు మాని, అతి కష్టం మీద నిందితులను పట్టుకున్న ప్రత్యేక బృందాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్రతో పాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు.

అనుమానంతో భార్యను చంపిన భర్త

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.