ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ

author img

By

Published : Mar 3, 2021, 3:27 PM IST

central-minister-smriti-irani-visited-tirumala-temple in andhra pradesh
తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ

తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ దర్శించుకున్నారు. తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి.. తితిదే ఆధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి.. శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: తండ్రి మూఢనమ్మకం- ఐదేళ్ల బాలుడి సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.