ETV Bharat / state

పిల్లలకు కేక్​ తినిపించిన ఎమ్మెల్యే

author img

By

Published : Dec 25, 2020, 5:40 PM IST

MLA sridhar babu participating in festival celebrations at manthani
పిల్లలకు కేక్​ తినిపించిన ఎమ్మెల్యే

ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ సంబురాల్లో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భగవంతుని ముందు అందరూ ఒకటేనని.. దేవుని ఆశీర్వాదం వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు.

పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రార్థనలు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీధర్ బాబును శాలువాతో సత్కరించారు.

క్రిస్మస్ సందర్భంగా మంథనిలోని బేతెల్ చర్చిలో క్రైస్తవులతో కలిసి ఎమ్మెల్యే ప్రార్థనలు చేశారు. కేక్​కట్ చేసి చిన్నపిల్లలకు తినిపించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో చిరకాలం ఉండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు.

MLA sridhar babu participating in festival celebrations at manthani
పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇదీ చూడండి : ముక్కోటి వైభవం.. భక్తుల తన్మయత్వం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.