ETV Bharat / state

'వ్యాక్సిన్​తోనే మహమ్మారిని అరికట్టవచ్చు'

author img

By

Published : Jun 6, 2021, 4:01 PM IST

Telangana news
పెద్దపల్లి జిల్లా వార్తలు

పెద్దపల్లి జిల్లా మంథని సామాజిక వైద్యశాలలో ప్రజల కోసం ప్రవాస భారతీయులు సమకూర్చిన ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు, అంబులెన్సును వైద్య అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు ప్రారంభించారు. సీఎస్​ఆర్​ కింద బోయింగ్​ ఇండియా సంస్థ అంబులెన్సును, ప్రవాస భారతీయులు ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను సమకూర్చారు.

కొవిడ్​ మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యాక్సిన్​ ఒకటే మార్గమని మంథని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు అన్నారు. పోలియో టీకాల మాదిరిగా.. ఇంటింటికీ వెళ్లి కొవిడ్​ వ్యాక్సిన్​ వేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రవాస భారతీయులు సమకూర్చిన ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను ప్రారంభించారు. ప్రతిఒక్కరికి వ్యాక్సిన్​ ఉచితంగా వేయాలని డిమాండ్​ చేశారు. అదేవిధంగా కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. జర్నలిస్టు రఘు అరెస్టును ఖండిస్తున్నామని వెంటనే విడుదల చేయాలన్నారు.

ప్రజల కోసం రెండు ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు సమకూర్చిన ప్రవాస భారతీయులు శ్రీనివాస్​, ఎం.మోహన్​ను ఎమ్మెల్యే అభినందించారు. అదేవిధంగా సీఎస్​ఆర్​ కింద అంబులెన్సును అందించిన బోయింగ్​ ఇండియా సంస్థకు అందుకు సాయం చేసిన ఆ సంస్థ సీఎస్​ఆర్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ యజ్ఞంబట్ల ప్రవీణకు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యులకు మాస్కులు, శానిటైజర్లు, ఫేస్​షీల్డ్​లు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి: Vaccine Drive : మహానగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.