ETV Bharat / state

Couple Suicide in Peddapalli : ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య.. అనాథలైన ఆ పసిబిడ్డలకు దిక్కెవరు?

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 12:40 PM IST

Peddapalli district
couple suicide

Couple Suicide in Peddapalli : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల మరణంతో అభంశుభం తెలియని వారి పిల్లలు దిక్కులేని వారయ్యారు.

Couple Suicide in Peddapalli : నేటి కాలంలో చిన్నపాటి కారణాలతో.. క్షణికావేశంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న అపజయాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రేమ విఫలమైందని ఒకరు.. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు... భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని.. కుటుంబంలో సమస్యలను తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్నవారిని విషాదంలో నెట్టేస్తున్నారు.

Peddapalli Couple Suicide : ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న కుటుంబం వారిది. కానీ ఈ క్రమంలోనే ఆ దంపతుల మధ్య ఆర్థిక ఇబ్బందులు చిచ్చురేపాయి. ఈ విషయమై పలుమార్లు వారి మధ్య గొడవలు జరిగాయి. ఈ సమస్యలన్నింటికి చావే పరిష్కారమని ఆ భార్యాభర్తలు భావించారు. అనుకున్నదే తడవుగా వారు సోమవారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణానికి (Committed Suicide) పాల్పడ్డారు. కానీ అభంశుభం తెలియని ఆ పసిబిడ్డలను దిక్కులేని వారు చేశారు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో (Peddapalli District) చోటుచేసుకుంది.

విషాదం... ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని నెల్లిపల్లికి చెందిన కటుకు అశోక్ - సంగీతలకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలుండగా.. కూలీ పనులు చేసుకుంటూ భార్యాభర్తలు జీవనం సాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. డబ్బుల విషయంలో వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

Peddapalli District
ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు అశోక్‌ సంగీత

ఈ క్రమంలోనే సోమవారం రాత్రి అశోక్‌-సంగీత.. పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున పక్కింటి వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు దంపతులు చనిపోవటంతో వారి నాలుగేళ్ల బాబు సాయికృష్ణ, మూడేళ్ల పాప సనా పరిస్థితి దయనీయంగా మారింది. దిక్కులేని వారిగా మారిన పసిపిల్లలను చూసి స్థానికులు కంటతడిపెట్టారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మూణ్నెళ్ల పసికందును హతమార్చి.. దంపతుల బలవన్మరణం

Family Suicide In Kushaiguda : ఇటీవలే హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కుషాయిగూడ పరిధిలోని కందిగూడలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పిల్లల అనారోగ్యం బారిన పడటంతో ఆ దంపతులు మానసిక వేదనకు గురయ్యారు. వైద్యం అందించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మనో వేదనకు గురయ్యారు. బిడ్డలకు విషమిచ్చి.. తామూ తీసుకున్నారు. మృతులు భార్యాభర్తలు సతీశ్‌, వేద, కాగా పిల్లలు నిషికేత్‍‌, నిహాల్‍‌. ఆత్మహత్య చేసుకున్న గదిలో లేఖ లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. తమ నలుగుర్ని కాపాడాలని ప్రయత్నించొద్దుని.. ప్రశాంతంగా చనిపోనివ్వండని అందులో రాసినట్లు పోలీసులు తెలిపారు.

Wife And Husband Suicide In Medak : కుటుంబ కలహాలతో భార్య.. కాపాడపోయి భర్త..

ఉరివేసుకుని భార్య.. రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.