నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా(Collector of Local Bodies) చిత్రా మిశ్రా బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్లో.. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆమెకు పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానం పలికారు. గతంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పని చేసిన బీఎస్ లత నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు.
చిత్రా మిశ్రా 2019 బ్యాచ్కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి. ఇంతకు ముందు వీరు నాగర్కర్నూల్ జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్గా పని చేశారు. కాగా నిజామాబాద్ వీరికి మొదటి పోస్టింగ్. ఈ కార్యక్రమంలో.. మెప్మా పీడీ రాములు, డీపీఓ జయసుధ, ఏవో సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Weather report: రాగల 3 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు